NRML: ప్రమాదవశత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. బైంసా మండలంలోని కోతుల్ గామ్ గ్రామంలో చిట్యాలవార్ గంగారం(60) అనే వృద్ధుడు బర్రెలు మేపుతూ ఉంటాడు. మంగళవారం గంగారం బర్రెలు మేపుతూ చెరువు దగ్గర వెళ్లగా ప్రమాదవశత్తు చెరువులో పడిపోయాడు. గమనించేసరికి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.