MHBD: దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణను ఇవాళ ప్రభుత్వ విప్ డాక్టర్ రామ్ చందర్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. రైల్వే సికింద్రాబాద్ సంచాల్ భవన్లో డీఆర్ఎంను కలిసి మహబూబాబాద్లో రైల్వే వ్యాగన్ తయారీ అనుబంధ సంస్థలు స్థాపించాలని విజ్ఞప్తి చేశారు.