AP: అన్నమయ్య(D) ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసులో మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఇందులో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డిని A17గా, ఆయన బావమరిది గిరిధర్ రెడ్డిని A18గా చేర్చారు. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య 21కి పెరిగింది. ప్రధాన నిందితుల కోసం అధికారులు బెంగళూరులో నిఘా వేశారు.