ప్రకాశం: కంభం పట్టణంలో శుక్రవారం ఎస్సై నరసింహారావు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.