GDWL: ఎర్రవల్లి మండల పరిధిలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంను,10 th బెటాలియన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సంతోష్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యలను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పి, పలు ప్రశ్నలను అడిగారు.