NRML: టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకుల ఆధ్వర్యంలో బాసర ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సంతోష్ రావు, మండల అధ్యక్షుడిగా భీమ్రావు, ప్రధాన కార్యదర్శిగా గౌతం, కోశాధికారిగా బండారి ఆనంద్ లను ఎన్నుకున్నారు. విలేకరులు నైతిక విలువలు పాటిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని నాయకులు సూచించారు.