BHPL: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో “సమాచార హక్కు చట్టం – 2005” వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పౌరులు కోరిన సమాచారాన్ని నిర్దేశిత సమయంలో అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ చట్టం ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంలో కీలకమని ఆయన అన్నారు.