NZB: రుద్రూర్ మండల కేంద్రంలో రెండు రోజుల పాటు ఉత్సాహంగా సాగిన మండల స్థాయి అంతర పాఠశాల క్రీడలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు గెలుపు కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. ఈ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్గా నిలిచారు. విజేతలకు ఎంఈవో కట్ట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్రశేఖర్ బహుమతులు అందజేశారు.