కృష్ణా: అవనిగడ్డలో ఆదివారం సాయంత్రం 30 ఎకరాల వరిగడ్డి వామి దహనమైంది. నివాస గృహాల మధ్య ముగ్గురు రైతులకు చెందిన గడ్డివామి ఒక్కసారిగా తగలబడటంతో స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన తరలివచ్చి మంటలను ఆర్పి ప్రమాద తీవ్రతను అదుపు చేశారు. ఘటనపై రైతు రంగారావు మాట్లాడుతూ.. ఎవరో కావాలని తగులబెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.