MHBD: మరిపెడ మండలంలోని యల్లంపేట స్టేజీ వద్ద గురువారం భూక్య వెంకన్న (35) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే వెంకన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టారు.