»Cricket Is Becoming Like A Baseball Game Punjab Captains Key Comments
IPL2024: క్రికెట్ గేమ్ బేస్బాల్లా తయారైంది.. పంజాబ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ క్రికెట్ ఇప్పుడు బేస్బాల్ గేమ్లా మారుతోందిని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శామ్ కరన్ అన్నారు. కలకతా నిర్దేశించిన భారీ స్కోర్ను ఛేజ్ చేసి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అంత భారీ స్కోర్ను ఛేజ్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది.
IPL2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. చూసే ప్రేక్షకులకు కన్నుల పండుగగా మారుతోంది. ఒక్కో ఆట ఒక్కో అనుభూతిని పంచుతుంది. మ్యాచ్ అంతా సిక్స్లు, ఫోర్స్తో మోత మోగుతుంది. ఈ మేరకు పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ ఇప్పుడు బేస్బాల్లా మారింది అని కామెంట్ చేశారు. ప్రస్తుతం శామ్ మాటలు వైరల్ అవుతున్నాయి. ఆయన అన్నది అక్షారాల నిజం. దానికి గత మ్యాచే ఉదాహారణ. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్తో భారీ స్కోర్ 261 పరుగులు చేసింది. తరువాత రంగంలోకి దిగిన పంజామ్ రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి 8 బంతులు మిగిలి ఉండగానే గెలుపోందింది.
మ్యాచ్ గెలిచిన తరువాత పంజాబ్ కెప్టెన్ శామ్ కరన్ మాట్లాడుతూ.. క్రికెట్ ఇప్పుడు బేస్బాల్ గేమ్లా మారిపోతోందని అన్నారు. ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాలంటే ఇది తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ అని, కానీ భారీ స్కోర్ తమ ముందు ఉండడంతో ముందు ఆలోచించాను అని కానీ బ్యాటర్ల దూకుడు పెరుగుతుండడంతో నమ్మకం వచ్చిందని చెప్పారు. మొత్తానికి భారీ టార్గెట్ను చేరుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. ఇక బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోతున్నారు అని దాంతో క్రికెట్ కాస్త బేస్బాల్ గేమ్ను తలపిస్తోందని చెప్పారు. బెయిర్స్టో, శశాంక్ అద్భుతంగా ఆడారని అన్నారు. ఇకపై ప్రతీ మ్యాచ్ తమకెంతో కీలకమని పేర్కొన్నారు.