ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీతం పెంచలేదని.. లీవ్ ఇవ్వలేదని బ్యాంక్ మేనేజర్పై గార్డ్ కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలైన బ్యాంక్ మేనేజర్ మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గార్డ్ రవీంద్ర హుడా, అతడి సహచరుడు శిశుపాల్ను అరెస్ట్ చేశారు. గాజియాబాద్లోని పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో ఈ ఘటన జరిగింది.