E.G: బొమ్మూరుకు చెందిన పెనుమళ్ళ రమ్య స్మృతి(35) మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో శనివారం చికిత్స కోసం వచ్చింది. తగిన పర్యవేక్షణ లేకపోవడంతో కీ ప్యాడ్ ఫోన్ మింగేసింది. దీంతో వైద్యులు చికిత్స చేసి ఫోన్ తొలగించారు. పరిస్థితి విషమించడంతో KKD జీజీహెచ్లో చేర్చగా ఆదివారం మృతి చెందింది.