ELR: ఏలూరు వైఎస్ఆర్ కాలనీకి చెందిన పోడూరి రాజేష్ (42) ఆదివారం హత్యకు గురయ్యాడు. ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి రాజేశ్ను పని ఉందని బయటకు పిలిచి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన అతన్ని ఏలూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.