KMM: ఎదులాపురం గ్రామపంచాయతీ వరంగల్ X రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.