TG: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. బాలానగర్ పీఎస్ పరిధి పద్మానగర్లో ఓ మహిళ ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల కవల పిల్లలను తల్లి సాయిలక్ష్మి గొంతు నులిమి చంపింది. అనంతరం మూడో అంతస్తు నుంచి ఆమె దూకి చనిపోయింది. సాయిలక్షి స్వగ్రామం ఏలూరు జిల్లా నూజివీడుగా గుర్తించారు. దంపతుల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.