ASR: జీ.మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్ రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, జీపు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో జీపులో వెళుతున్న పలువురు స్వల్పంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.