HYD: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద భూక్యా పెంటనాయక్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్ నగర్ వాసి అయిన పెంటనాయక్, చర్లపల్లిలోని తన సోదరి వద్ద ఉంటూ ఐటీ కారిడార్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.