NDL: బనగానపల్లె మండలంలో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చంద్రగ్రహణం అనంతరం సోమవారం తెల్లవారుజామున తలుపులు తెరిచారు. వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రోక్షణ అనంతరం స్వామికే రుద్రాభిషేకం పంచామృతాభిషేకం పుష్పలంకరణతో కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.