కోనసీమ: ఆలమూరు మండలం మూలస్థానం కూడలి దగ్గరలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట మండలం శీలంవారిపాలానికి చెందిన తల్లి, కొడుకు గాయపడ్డారు. కొత్తపేట నుంచి రాజమండ్రికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్లో వారిని ఆసుపత్రికి తరలించారు.