ATP: బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి జిల్లా జైలులో ఈ నెల 10వ తేదీన వేరుశనగ చెక్కకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. 75 వేల కిలోల వేరుశనగ చెక్క వేలం వేస్తామని, పాల్గొనేవారు రూ. 60వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా జైలులో సంప్రదించాలని వారు పేర్కొన్నారు.
BPT: సూర్యలంక బీచ్లో పర్యాటకులు ఎండకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు నీడనిచ్చే గొడుగులు, బల్లలను తొలగించడమే ఇందుకు కారణం. వేసవిలో వారాంతాల్లో వచ్చే వేలాది మంది నీడ లేక అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి గొడుగులు, బల్లలను తిరిగి ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
విశాఖ: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబరు 8688400499 ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామని సీఎండీ పేర్కొన్నారు.
ELR: జంగారెడ్డిగూడెంకు చెందిన నాగసూరి మాధురికి నటసార్వభౌమ, మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి పురస్కారం లభించింది. ఏలూరులో టీడీపీ, జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. ఇన్నర్ వీలు క్లబ్ ఆఫ్ JRG గోల్డ్ పూర్వ అధ్యక్షురాలుగా ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ పురస్కారానికి ఎంపిక చేశారు.
కోనసీమ: అంబాజీపేట జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చేత పనులు చేయిస్తున్న సమయంలో గాయపడిన చప్పిడి మణికంఠ గాయాలు పాలైన విషయం తెలిసిందే. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మణికంఠను RSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం పరామర్శించారు. RSU రాష్ట్ర ఉపాధ్యక్షులు కంటేపల్లి నరేంద్ర మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల చేత పాఠశాలలో పనులు చేయించడం సరికాదన్నారు.
NDL: గోస్పాడు మండలానికి ప్రభుత్వం స్వచ్ఛ రథం మంజూరు చేసినట్లు ఎంపీడీవో షేక్ అమానుల్లా ఒక ప్రకటన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ రథాన్ని అందించారని పేర్కొన్నారు. ఇది ప్రతి రోజు గ్రామాల్లో తిరిగి పొడి, తడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రజల నుంచి సేకరిస్తుందని వివరించారు.
కడప రిమ్స్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున దారుణ హత్య చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం కడప శివారులోని అలంఖాన్పల్లి జాతరలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో దస్తగిరి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనలో దస్తగిరి అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన కుమారుడికి గాయాలై నిమ్స్ చికిత్స పొందుతున్నారు.
KRNL: ఆదోని అన్న క్యాంటీన్లలో ఆహార నాణ్యత తప్పనిసరిగా పాటించాలని మునిసిపల్ కమిషనర్ నహిమ్ హమద్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన తనిఖీలలో టిఫిన్ రుచిగా ఉండాలని, చట్నీ పల్చగా ఉండకూడదని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపయోగించిన ప్లేట్లను వేడి నీటితో శుభ్రం చేయాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు.
అన్నమయ్య: చంద్రగిరి–నర్సింగాపురం మధ్య రైల్వే పట్టాలపై ఆదివారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలానికి చెందిన షేక్ అస్లాం (20)గా గుర్తించారు. ఘటనపై చిత్తూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
SKLM: పలాస ప్రాంత ప్రజలకు దశాబ్దాల కాలంగా కలగానే మిగిలిన ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను ఆదివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శిరీష పరిశీలించారు. ఈ మేరకు పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
ATP: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఎండాకాలం కావడంతో తగినన్ని ఫ్యాన్లు, చల్లని తాగునీరు కొరత లేకుండా ఉండేందుకు డీఈఓ ప్రసాద్ బాబు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు సిబ్బందితో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు.
ATP: జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తుండటంతో ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అనంతపురంతో పాటు పొరుగున ఉన్న 6 జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. జిల్లా నుంచి 517 మంది, ఇతర జిల్లాల నుంచి 716 మంది సిబ్బందిని ఈ విధులకు నియమించారు. వీరితో పాటు ఏఆర్ ఫోర్స్, స్పెషల్ పార్టీ పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటున్నారు.
KDP: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అలఖాన్ పల్లి గ్రామానికి చెందిన దస్తగిరిని నిన్న రాత్రి రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలిసిన వెంటనే మాజీ సురేష్ కుమార్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు, తదితరులు మృతదేహాన్ని పరిశీలించారు.
NTR: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. కండ్రిక జంక్షన్ వద్ద రత్నాకుమార్ వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గంజాయిని విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ATP: అనంతపురం జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవానికి ‘మిస్సైల్ ఉమెన్’గా పేరొందిన డా.టెస్సీ థామస్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ అయిన ఆమెకు ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన సోమవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు.