AP: అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్.కోట మరియు ఎల్.కోట జంక్షన్ల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
GNTR: తెనాలిలో అగ్నిమాపక కేంద్రంలో మంగళవారం జరిగిన అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి త్రీటౌన్ సీఐ సాంబశివరావు విచ్చేశారు. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్, రూరల్ ఎస్సై ఆనంద్లతో కలిసి ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు ప్రమాదాలపై పలు జాగ్రత్తలు తెలియజేశారు.
KRNL: అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతీ పౌరుడు కృషి చేయాలని కోసిగి మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ తిక్కన్న, TDP మండల అధ్యక్షుడు మల్లిఖార్జున, TDP జిల్లా ప్రధాన కార్యదర్శి యోసేపు, విజయ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పెద్దకడబూరులో ఆయన విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఇవాళ యలమంచిలి వాస్తవ్యులు ముదునూరి వెంకట లక్ష్మీపతి రాజు కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
AKP: గొలుగొండలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. అనంతరం నూతన భవనాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేయడం జరుగుతుందని హోం మంత్రి అనిత అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేర నియంత్రణ చేస్తున్నామన్నారు.
E.G: పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై మృతి చెందిన పల్లా దానయ్య కుటుంబ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ ఇవాళ పరామర్శించారు. అనంతరం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా వారి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా చెక్కును మంత్రి అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
SKLM: రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని జిల్లా కిషన్ సంఘం అధ్యక్షుడు కోత మధుసూదన్ రావు అన్నారు. మంగళవారం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేశారని రాసిన రాజ్యాంగమే నేడు చలామణి అవుతుందని అన్నారు. సంగం నాయకులు పాల్గొన్నారు.
సత్యసాయి: రామగిరి మండలం నసనకోట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇవాళ అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పరిటాల సునీత పూలమాల వేసి నివాళులర్పించింది. ఈ సందర్బంగా ఆయన విగ్రహం దగ్గర ముగ్గులతో అలంకరించినటువంటి మహిళలకు చీరలను బహుమతిగా ఇచ్చారు.
NTR: కంచికచర్ల వసంత కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై అగంతకుడు కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి పరారయ్యాడు. వేకువజామున జరిగిన ఈ ఘటనలో బాధితురాలికి భుజం, ఛాతి, ముఖం, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, బండారు శ్రావణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ELR: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద గల ఆర్టీసీ డిపో గ్యారేజీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నెల్లూరు వేదాయపాళెం పోలీసులు 30కు పైగా కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ జొన్నలగడ్డ శ్రీనాథ్ను సాహసోపేతంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్ టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి, హుబ్లీలలో వరుస చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
ప్రకాశం: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. మార్కాపురం ఎస్సీ సెల్ నాయకులతో కలిసి కోర్టు సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
SKLM: బాల్యవివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. మంగళవారం మండలం గ్రామంలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు హక్కులు, చట్టాలు పట్ల అవగాహన అవసరం అని, వాటి ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తున్నపడు హెల్మెట్ ధరించాలన్నారు.
PPM: విద్యుత్ ట్రాన్స్షార్మర్ మంజూరు చేయాలని RTI జిల్లా అధ్యక్షులు ఐ. రామకృష్ణారావు డిమాండ్ చేసారు. మంగళవారం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కురుపాం మండలం మొండెంఖల్ గ్రామం లోవోల్టేజ్తో ఇబ్బందిగా ఉంది అన్నారు. ఒకటీ, రెండు, మూడు రోజులు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.