ATP: యాడికిలో జరిగిన జలధార సభలో CM చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గ ప్రగతి నివేదికను స్వయంగా చదివి వినిపించారు. సరిగ్గా పనిచేయని అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ కోరారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, ప్రజల సంతృప్తే లక్ష్యంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఆదాయం తగ్గినా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.
PPM: విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా 9 మంది వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.
NLR: ఎండల తీవ్రత పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఖాదరవల్లి సూచించారు. సోమవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిధిలో వైద్య సిబ్బంది పర్యటించారు. సన్ స్ట్రోక్ ఎక్కువ ఉన్నందున ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
తిరుపతి, చిత్తూరు జిల్లా మీదుగా 2 హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మైసూరు-చెన్నై కారిడార్లో భాగంగా CTR- TPT మీదుగా నాయుడుపేటకు లింక్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరగా కేంద్రం అమోదించింది. దీంతో నెల్లూరు, నాయుడుపేట, శ్రీసిటీ మీదుగా చెన్నైకి ఒక కారిడార్, నాయుడుపేట, TPT, CTR, బంగారుపేట, బెంగళూరు, మండ్య మీదుగా మైసూరుకు మరో కారిడార్ ఏర్పాటు కానుంది.
E.G: నిరుపేదల ఆరోగ్య భద్రతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆపదలో ఉన్న వారికి CMRF ఒక సంజీవనిలా మారుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం పెరవలి మండలం తీపర్రులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 108 మంది లబ్ధిదారులకు రూ. 54,45,187 విలువైన CMRF చెక్కులు & LOC పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
GNTR: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సలాం సెంటర్ ప్రాంతంలో సోమవారం కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ పర్యవేక్షణలో, సీఐ వీరేంద్రబాబు నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
BPT: ఈ నెల 9న సీఎం చంద్రబాబు సూరేపల్లెకు రానున్నారు. ఆయన పర్యటనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించారు. సీఎం పర్యటనలో భద్రత, ప్రోటోకాల్పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేష్ సోమవారం మైనర్ వాహన చోదకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టంపై అవగాహన కల్పించారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ATP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను సోమవారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జితేంద్ర గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. యువ నేత లొకేష్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ అభివృద్ధి గురించి నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యేను ఆరా తీశారు.
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కరివేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. మేయర్ సుజాత అశోక్, కమిషనర్ నందన్ పాల్గొని అర్జీ దారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. మొత్తం 49 వినతులు స్వీకరించినట్లు అధికారులు తెలియజేశారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
KDP: చింతకొమ్మదిన్నె(M) ఇందిరానగర్లో 5000 కుటుంబాలకు కేవలం 2 రేషన్ షాపులే ఉన్నయన్నారు. దీని ద్వారా వెయ్యి మందికే సరుకులు అందుతున్నాయని RCP సీకే దిన్నె కార్యదర్శి ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ.. వెంటనే మరో 4 దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
AKP: ఎలమంచిలి మండలం మర్రిబందలో సహజీవనం చేస్తున్న అల్లూరి జిల్లాకు చెందిన వంతల కుమారి(40), మర్రి కామేష్ ఆదివారం రాత్రి మద్యం సేవించి గొడవ పడినట్లు ఎస్సై సావిత్రి తెలిపారు. ఈ గొడవలో కామేష్ పిడికిలితో గుద్దడంతో తీవ్రంగా గాయపడిన కుమారి మృతి చెందిందన్నారు. వీరిద్దరు స్క్రాప్ షాపులో పనిచేస్తున్నారన్నారు.
NDL: కోవెలకుంట్లలో సోమవారం బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల అధ్యక్షుడు లోకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలు అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అశోక్ రెడ్డి పేర్కొన్నారు.