ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజా సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలు అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అశోక్ రెడ్డి పేర్కొన్నారు.