AKP: ఎలమంచిలి మండలం మర్రిబందలో సహజీవనం చేస్తున్న అల్లూరి జిల్లాకు చెందిన వంతల కుమారి(40), మర్రి కామేష్ ఆదివారం రాత్రి మద్యం సేవించి గొడవ పడినట్లు ఎస్సై సావిత్రి తెలిపారు. ఈ గొడవలో కామేష్ పిడికిలితో గుద్దడంతో తీవ్రంగా గాయపడిన కుమారి మృతి చెందిందన్నారు. వీరిద్దరు స్క్రాప్ షాపులో పనిచేస్తున్నారన్నారు.