SKLM: రసాయన ఎరువులు వాడకం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, సేంద్రియ వ్యవసాయమే ఆరోగ్యానికి రక్షణ అని ధరణిపుత్ర ఆర్గానిక్స్ డెవలప్మెంట్ ఫార్మర్స్ సొసైటీ ఛైర్మన్ ఉమామహేశ్వరరావు అన్నారు. నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. రసాయన రహిత వ్యవసాయం, జీవామృతం, ఘన జీవామృతం వంటి పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.
VZM: జిల్లా పోలీసు శాఖలో డీ.సీ.ఆర్.బీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తూ, గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన ఎ. జగదీశ్వర రావు భౌతికకాయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సందర్శించారు. అనంతరం పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రూ.లక్ష కుటుంబ సభ్యులకు అర్థిక సహాయం అందించారు.
GNTR: వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని అద్దంకమ్మ అమ్మవారి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించగా భక్తులు భారీగా తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.
PLD: కారంపూడి మండల కేంద్రంలోని టూ టౌన్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ముఖ్యమని పేర్కొంటూ.. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఆలయ సమీపంలో 5.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం భక్తుల కోసం నిత్యన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా: నాగాయలంకలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ నిధులు రూ.60 లక్షలు, భక్తుల విరాళాలు రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించిన శ్రీ భూనీళా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, లిఖిత ఇన్ఫ్రా ఛైర్మన్ గడ్డిపాటి శ్రీనివాసరావు, శీలం అశ్విన్ కుమార్ విచ్చేసి మహోత్సవంలో భాగస్వాములయ్యారు.
E.G: గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రాజమండ్రిలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 3 కోట్ల వ్యయంతో పిండ ప్రధాన కార్యక్రమాల భవనం, రూ. 70 లక్షలతో నూనె వర్తకుల అన్నదాన సమాజం భవనం పునః నిర్మాణం పనులను దేవదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి, ఎంపీ పురందేశ్వరి కలిసి ప్రారంభించారు.
CTR: వెదురుకుప్పం మండలం తార్లబైలు సర్వే నం.231లోని 98 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జా ప్రమాదం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చర్యలు తీసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కట్టుదిట్టం చేశారు. ఆక్రమణకు యత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు త్వరగా స్పందించడంపై గ్రామస్థులు అభినందించారు.
VZM: గజపతినగరం మండలం పురిటిపెంట న్యూ కాలనీలో గల దేవర కిరణ్ ఇంటి వద్ద ఆదివారం ‘మన ఊరు-మన జెండా’ నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు రొంగల్ గోపి ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ పిలుపు మేరకు పార్టీ పతాకాన్ని ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర కిరణ్ ఆవిష్కరించారు. జిల్లా ఓబీసీ అధ్యక్షులు దొగ్గ దేవుడు బాబు పాల్గొన్నారు.
SKLM: సోంపేటలోని ఉద్దానం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ‘ఉద్దానం కేర్ హెల్త్ క్లినిక్’ను ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బి. అశోక్ ప్రారంభించారు. ఆయన క్లినిక్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్న నేపథ్యంలో, ఈ క్లినిక్ స్థానికులకు ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.
PLD: దాచేపల్లి (M) సారంగపల్లి అగ్రహారంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ వైర్లను దొంగతనం చేశారు. గ్రామంలోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లే లక్ష్యంగా దుండగులు ఈ పని చేసినట్లు స్థానికులు, రైతులు చెప్పుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విదేశీ పర్యటనకు ఎట్టకేలకు కోర్టు షరతులతో అనుమతి లభించింది. మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు జామీను, పర్యటన పూర్తి వివరాలు ముందుగా సమర్పించాలని ఆదేశించింది. విదేశాల్లో ఉన్నప్పుడు ఫోన్ ఆన్లో ఉంచి, జూలై 15లోపు భారత్కు రావాలని సూచించింది. తిరిగి వచ్చిన వారం రోజుల్లో కోర్టులో హాజరు కావాలని పేర్కొంది.
BPT: పిట్టలవానిపాలెం మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందని స్థానికులు అంటున్నారు. పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని, ఇసుక వాహనాలు అతి వేగంతో, పరిమితికి మించిన లోడుతో వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వారు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప నగరంలో గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ATP: ఐపీఎల్ నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లపై నిఘా పెంచినట్లు SP జగదీష్ హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ రూపాల్లో బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సైబర్ బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తున్నాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారిపై కేసులు నమోదు చేసి, ఖాతాలు ఫ్రీజ్ చేస్తామని పేర్కొన్నారు.