విశాఖపట్నంలో జీవీఎంసీ కమిషనర్ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు అడుగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ వాట్సాప్ ఖాతాలతో అధికారులు, ప్రజలకు మెసేజ్లు పంపుతూ అత్యవసరమని చెబుతున్నారు. ఇలాంటి ఫేక్ సందేశాలకు స్పందించవద్దని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరించారు.
PLD: చిలకలూరిపేట మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, వైసీపీ నేత షేక్ అబ్దుల్లా టీడీపీలో చేరారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. అబ్దుల్లా చేరికతో పట్టణంలో పార్టీ బలపడుతుందని ప్రత్తిపాటి అన్నారు. ఎమ్మెల్యే చేసిన అభివృద్ధికి ఆకర్షితుడనై తాను పార్టీ మారానని అబ్దుల్లా తెలిపారు.
AKP: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై పురుషోత్తం హెచ్చరించారు. పాయకరావుపేటలో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో వివిధ అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బాలికల రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూ క్రిమినల్ చట్టాలు, పోస్కో యాక్ట్, సైబర్ ఫ్రాడ్ గురించి వివరించారు.
ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ జీ.దేముళ్లు అన్నారు. ఈగల్ టీమ్, జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వల్ల కలిగే అనర్ధాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
BPT: సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రూ.50 లక్షల CSR నిధులతో నిర్మించిన నూతన కాపు కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ భవనం కాపు సామాజికవర్గ వివాహాలు, ఆత్మీయ సమావేశాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ATP: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.
NDL: ‘జలమే జీవం – జల సంరక్షణే ధ్యేయం’ అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం కరివేన చెరువు కాలువ వద్ద ఇవాళ జలధార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి కాలువలో పూడికతీత పనులు చేపట్టారు. భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.
ASR: బీజమరవలసలో ఈనెల 18న నాటు తుపాకీతో మహిళలపై కాల్పులు జరిపిన నిందితుడు లక్ష్మణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాఫీ తోటకు నిప్పు పెట్టారన్న అనుమానంతో బీమలమ్మ (53),ఆమె కుమార్తె శిరీషా (16)పై కాల్పులు జరపడంతో ఇద్దరూ గాయపడ్డారు. నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై ఎల్.సురేష్ ఇవాళ తెలిపారు.
CTR: కార్వేటి నగర్ పోలీస్ స్టేషన్, ఎస్సై తేజస్విని జీఎంఎస్కేలతో సమావేశం నిర్వహించి, గంజాయి, మహిళలపై నేరాలు, సామాజిక భద్రత వంటి కీలక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పోక్సో సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ప్రజలతో చురుకుగా మమేకమై, నమ్మక భద్రతను పెంపొందించేందుకు తక్షణమే స్పందించాలని సిబ్బందిలకు సూచించారు.
KRNL: పర్యావరణ పరిరక్షణలో ప్రతి వ్యక్తీ తన బాధ్యతను గుర్తించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఇవాళ దుపాడు అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన ప్రపంచ భూమి దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నీటి ఆదా, విద్యుత్ వినియోగం తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడం అవసరమని తెలిపారు.
W.G: డిగ్రీలు లేని దిగ్గజం శకుంతలాదేవి అని HM కొల్లాబత్తుల సూర్యకుమార్ అన్నారు. పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి వర్ధంతి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరికం వల్ల చదువుకోలేకపోయినా, మేధస్సుతో గణితంలో అత్యంత ప్రావీణ్యతను చూపిన గణిత దిగ్గజం శకుంతలాదేవి అని అన్నారు.
మార్కాపురం నియోజకవర్గంలోని 102 చెరువులను బాగు చేసి వాటిని వచ్చే వర్షాకాలంలో నీటిని నింపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులకు ఆదేశించారు. మంగళవారం మార్కాపురం కలెక్టరేట్లో ‘జలధార జలహారతి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టే భూగర్భ జలాలను పెంచాలన్నారు.
కోనసీమ: కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను సాంకేతికత సహాయంతో గుర్తించి రికవరీ చేసినట్లు ఎస్సై జి. సురేంద్ర తెలిపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్లో సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు మంగళవారం తిరిగి అందజేసినట్లు చెప్పారు. ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు.
PLD: నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ ప్రవేశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ రవికుమార్ ఉన్నత విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఇతర అతిథులు పీజీ కోర్సులు, అడ్మిషన్ విధానం, పరిశోధన అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
బాపట్ల: పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి తాగుతూ.. అమ్ముతున్న 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీ చంద్రమౌళి ఈ వివరాలను వెల్లడించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ సీఐ రాంబాబు, ఎస్సైలు విజయ్ కుమార్, నస్రీన్, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా వారికి నగదు బహుమతులు అందజేశారు.