CTR: చిత్తూరు సాయుధ దళ కార్యాలయంలో ఆధునిక సదుపాయాలతో నవీకరించిన జిమ్ను ఎస్పీ తుషార్ శనివారం ప్రారంభించారు. పోలీసు సిబ్బందికి శారీరిక దృఢత్వం, ఆరోగ్య పరిరక్షణ, విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించేందుకు ఈ జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు.
తూ.గో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో శనివారం రాజమండ్రిలోని జిల్లా ఉపాధి కార్యాలయ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీ కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 125 మంది అభ్యర్థులు జాబ్ మేళాకు హాజరుకాగా 49 మంది ఎంపిక అయ్యారని వివరించారు.
W.G: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని, ఇటువంటి పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి.గీతాబాయి హెచ్చరించారు. సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు.
KRNL: తుంగభద్ర నదిలో శనివారం ఈతకు వెళ్లి ఐదురుగు గల్లంతయ్యారు. సత్యనారాయణ స్వామి పూజకు హాజరైన బంధువులు పూజ అనంతరం నదికి వెళ్లారు. నీటి లోతు అంచనా వేయలేక ప్రమాదానికి గురయ్యారు. గల్లంతైన వారిలో హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీశ్ (35), మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర(25), ధను(23), ఉరవకొండకు చెందిన సంధ్య (22) ఉన్నారు.
ELR: జిల్లాలో మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు విజయవంతంగా ముగిశాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వర్చువల్ విధానంలో క్లస్టర్ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే స్ఫూర్తితో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు.
NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శనివారం సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆమె స్వామివారిని ప్రార్థించారు.
NTR: జిల్లా పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన 14 మంది పోలీసు అధికారులకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి. సరిత ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను శాలువాలతో సత్కరించారు. సుదీర్ఘకాలం ప్రజాసేవ చేసిన వారి సేవలను డీసీపీ కొనియాడారు.
NDL: చాగలమర్రిలో TDP కార్యకర్తలకు అండగా ఉంటానని ఆళ్లగడ్డ నియోజకవర్గం సీనియర్ నాయకుడు భార్గవ్ రామ్ అన్నారు. మండలంలోని చిన్న వంగలి గ్రామానికి చెందిన లక్కిరెడ్డి నరేంద్ర రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం భార్గవ్ రామ్ చిన్న వంగలి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
BPT: చీరాల రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైలులో చోరీకి పాల్పడిన నిందితుడిని చీరాల జీఆర్పీ పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. నిందితుడు సందీపన్ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అతడి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు గొలుసు,సెల్ఫోన్తో పాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, దర్యాప్తు ద్వారా కేసును త్వరగా ఛేదించినట్లు పోలీసు చెప్పుకొచ్చారు.
SKLM: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూన్ 2 న ప్రభుత్వ డీఎల్టీసీ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. సుధ శనివారం తెలిపారు. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని, మొత్తం 240 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VSP: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖకి రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మంజూరయ్యాయని ఎంపీ ఎం. శ్రీభరత్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో జరిగిన దిశా సమావేశంలో మాట్లాడారు. మధురవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల తాగునీటి సరఫరా,సెమీ బల్క్ వాటర్ సప్లై అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.
ASR: కూటమి ప్రభుత్వంలో ఆదివాసీలకు తీరని అన్యాయం జరిగిందని సీపీఎం జిల్లా కార్యదర్శి పీ.అప్పలనర్స ఆరోపించారు. శనివారం అరకులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిన్న పాడేరు పర్యటనకు వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గిరిజన వికాసంపై ప్రకటన ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల హామీల అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
VZM: డైరెక్టర్ జనరల్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( న్యూఢిల్లీ) ఆధ్వర్యంలో నిర్వహించబడనున్న రీ నీట్ 2026 ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు DRO సత్తిబాబు తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు 7 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
CTR: ఆపరేషన్ క్లీన్ స్వీప్ రెండవ వారం కార్యక్రమాల్లో భాగంగా శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ కాలువల శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. వెంగళరావు కాలనీలో శనివారం మేజర్ డ్రైనేజీ కాలువను శుభ్రం చేసే పనులను కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎంహెచ్వో డాక్టర్ లోకేష్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
సత్యసాయి: ప్రజల సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాసులతో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.