• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

ఎన్టీఆర్: విజయవాడ వన్ టౌన్ ఎస్ఐ భాగ్యలక్ష్మి శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన మద్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు. రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

April 5, 2026 / 10:07 AM IST

వడ్లపూడి వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

VSP: గాజువాకలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాకకు చెందిన అశోక్ పటేల్(46) అనే వ్యక్తి కూర్మన్నపాలెం వైపు వెళ్తుండగా వడ్లపూడి వంతెనపై, వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ శరిం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 5, 2026 / 10:03 AM IST

అమరావతి నిర్ణయానికి దీపోత్సవం

KRNL: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఆలూరులో ‘ఇంటింటికీ దీపోత్సవం’ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన నివాసంలో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల దీర్ఘకాల పోరాటానికి లభించిన గౌరవమని ఇంఛార్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 5, 2026 / 10:02 AM IST

జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ

అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసులను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది వెంటనే తమ కొత్త విధి స్థానాల్లో చేరాలని ఎస్పీ కార్యాలయం అధికారులు తెలిపారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం.

April 5, 2026 / 10:00 AM IST

బిడ్డ సాకుతో హారం మాయం: ముగ్గురి అరెస్ట్

E.G: రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తున్న బస్సులో మాయచేసి బంగారు హారం దొంగిలించిన ఘటన జరిగింది. చంటి బిడ్డకు పాలు కలపాలని చెప్పి బాధితురాలి దృష్టి మళ్లించి బ్యాగులోని 24 గ్రాముల హారం అపహరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

April 5, 2026 / 10:00 AM IST

మాజీ ఎమ్మెల్యేపై మంత్రి బీసీ సతీమణి ఆగ్రహం

NDL: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బనగానపల్లెలో అంతే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రవీంద్రనాథ్ రెడ్డి తనపై, ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 5, 2026 / 10:00 AM IST

అప్పనపల్లె పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో

KDP: ఖాజీపేట మండల వ్యాప్తంగా ఉన్న 21 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఇటీవల కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల్లో భాగంగా అప్పనపల్లి పంచాయతీ ప్రత్యేక అధికారిగా MPDO దివిజ సంపతిని నియమించారు. తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. పంచాయతీలో సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.

April 5, 2026 / 10:00 AM IST

స్వల్పంగా పెరిగిన చికెన్ ధరలు

ATP: అనంతపురం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.220, స్కిన్ లెస్ రూ.240 గుంతకల్లులో రూ.240, స్కిన్‌లెస్ రూ.260 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు రిజ్వాన్ తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి.

April 5, 2026 / 09:40 AM IST

సింగరకొండలో మృతదేహం కలకలం.. వ్యక్తి గుర్తింపుపై అన్వేషణ

బాపట్ల: అద్దంకి మండలం సింగరకొండ వద్ద ఓ వ్యక్తి మృతదేహం బయటపడటం ఆందోళన కలిగించింది. మినీ స్టేడియం సమీపంలోని రోడ్డుపై ఆదివారం ఉదయం శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

April 5, 2026 / 09:37 AM IST

శ్రీకాకుళం మీదుగా నడిచే రైళ్లకు అదనపు బోగీలు

శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్-తిరుపతి మధ్య నడిచే రైళ్లకు ఒక 3 ఏసీ బోగీ అలాగే విశాఖ-గుణుపూర్-విశాఖ మధ్య నడిచే రైళ్లకు ఒక స్లీపర్ బోగీని మే 31 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

April 5, 2026 / 09:35 AM IST

‘అబ్దుల్ కలాం స్కూల్ ప్రవేశ పరీక్ష రద్దు’

KRNL: APJ అబ్దుల్ కలాం మున్సిపల్ మెమోరియల్ హైస్కూల్ ప్రవేశ పరీక్షను DEO ఆదేశాలతో రద్దు చేస్తున్నట్లు ఆ స్కూల్ HM హూసేన్, పెరెంట్స్ కమిటీ ఛైర్మన్ టి.బిల్కీస్ బాను ఇవాళ తెలిపారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన నిర్వహించాల్సి ఉంది. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.100 ఎంట్రీఫీజు చెల్లించారని తెలిపారు. ఈ సొమ్మును తిరిగి ఇచ్చామన్నారు.

April 5, 2026 / 09:33 AM IST

బ్రిడ్జి లేక గ్రామాల ప్రజల కష్టాలు

E.G: సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక గ్రామాల్లో రవాణా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే రోడ్డు సౌకర్యం ఉండగా, మిగతా కాలంలో పడవలే ఆధారమని గ్రామస్థులు చెబుతున్నారు. రూ.35 కోట్లతో ప్రారంభించిన వంతెన నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ఇబ్బందులు పెరిగాయి. వరద సమయంలో ప్రాణాలను పణంగా పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు.

April 5, 2026 / 09:30 AM IST

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

W.G: భారత మాజీ ఉపప్రధాని, స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి వేడుకలను ఆచంట మండలం కొడమంచిలి అరుంధతిపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడారు. సామాజిక న్యాయ దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ధీరుడు జగ్జీవన్ రామ్ అని అన్నారు. ఆయన భారత సమాజంలో సమానత్వం కోసం కృషి చేశారని అన్నారు.

April 5, 2026 / 09:20 AM IST

మండలంలో కర్మక్రియలకు హాజరైన ఎమ్మెల్యే

CTR: పాకాల మండలం పెద్ద గోర్పాడు గ్రామంలో నిర్వహించిన కర్మక్రియలకు ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. గ్రామానికి చెందిన సూరినేని వెంకటరామ నాయుడు, గాలి రమేష్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

April 5, 2026 / 09:17 AM IST

బెలుము గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: కొలిమిగుండ్ల మండలం బెలుము గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర కన్వెన్షన్ హాల్‌ను ఆమె ఘనంగా ప్రారంభించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

April 5, 2026 / 09:16 AM IST