శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ శుభవార్త. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. భువనేశ్వర్-బెంగళూరు-భువనేశ్వర్-తిరుపతి మధ్య నడిచే రైళ్లకు ఒక 3 ఏసీ బోగీ అలాగే విశాఖ-గుణుపూర్-విశాఖ మధ్య నడిచే రైళ్లకు ఒక స్లీపర్ బోగీని మే 31 వరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.