SRD: రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల రవాణా సౌకర్యం మెరుగవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో 3 కోట్ల 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, బీటీీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు.