కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమితులైన డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అమీర్ మీర్జా భాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ ఎంపీడీవో తెలిపారు. పలువురు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు.
VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, దాని పేరుతో జరుగుతున్న దోపిడికే వ్యతిరేకమని స్పష్టం చేశారు.
VSP: సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శబల భోజనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంతో గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ పండుగలో కులాకార్ బియ్యం పంపిణీ చేశారు. చేతివృత్తులు, వెదురు ఇల్లు ఆకట్టుకోగా, ప్లాస్టిక్ రహిత ఏర్పాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. సహజ పదార్థాలతో తయారుచేసిన పానీయాలు, విత్తనాలు, ప్రకృతి ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.
KRNL: సి.బెళగల్ మండల పరిధిలోని పోలకల్ గ్రామంలోని మూడు సచివాలయాలను గ్రామ వార్డు పర్యవేక్షణ అధికారి డిప్యూటీ ఎంపీడీవో షాషావలి తనిఖీ చేశారు. ఇవాళ ఆయన సచివాలయాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే యొక్క వివరాలపై ఆరా తీశారు. యుఎఫ్ఎస్ సర్వేలో నమోదు కానీ సభ్యుల వివరాలను గుర్తించి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని తెలిపారు.
KDP: వేంపల్లె మండల తహసీల్దార్గా పి. మోహన్ కృష్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరులో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన ఆయన, పదోన్నతిపై వేంపల్లెకు బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
NDL: బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామ సమీపంలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, చరణ్ అనే నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని కర్నూలు ఫ్లై ఓవర్ వద్ద మంగమ్మ కాలేజీ వైపు నుంచి మంగమూరు సిగ్నల్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను స్కూటీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై వెనక కూర్చున్న బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. స్పందించిన స్థానికులు గాయపడిన బాలికను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికు చికిత్స కోసం తరలించారు.
GNTR: తెనాలి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు అధికారులకు సూచించారు. పట్టణంలోని భవనంవారి వీధి, గోలి డొంక, బోస్ రోడ్లోని సీతాంబ హోటల్ ఏరియాలో జరుగుతున్న అప్రోచ్ రోడ్డు, కాలువ నిర్మాణ పనులను శనివారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దేవస్థానం ప్రతిష్టను దిగజారుస్తున్నారని సత్తెనపల్లి పట్టణంలో వైసీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆయన వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేవలం పబ్లిసిటీ కోసమే చంద్రబాబు ఆయనను కొనసాగిస్తున్నారా అని ప్రశ్నించారు.
NTR: కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామ శివారులో 20 కిలోల గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయానికి సిద్ధం చేసిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీలేరు ప్రాంతం నుంచి తెచ్చిన గంజాయిని అమ్మేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారు. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.
కర్నూలులోని ఆర్.ఆర్. లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సృజనాత్మకత, క్రీడా నైపుణ్యాల ప్రోత్సాహం కోసం కల్చరల్, ఆటల పోటీలు నిర్వహించారు. ఇవాళ ముఖ్య అతిథులుగా ప్రధానోపాధ్యాయులు రవి, దాత వేదవ్యాసచార్ నాగరాజు పాల్గొన్నారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు, నాటికలు, అలాగే క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.
VSP: తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని ఆరోపిస్తూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛైర్మన్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
NDL: బనగానపల్లె మండలం జ్వాలాపురం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ టీడీపీ నాయకుడు మదన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆమె నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నమయ్య: జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రజలను సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో లభించే ఉచిత వైఫై వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అపరిచిత లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లు నమ్మవద్దని, ఫేక్ ప్రొఫైల్లకు దూరంగా ఉండాలన్నారు.
ELR: ముదినేపల్లి మండలం తూర్పుపాకల ఎంపీపీ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల తుఫాన్ కారణంగా వృక్షం పాఠశాల భవనంపై పడగా పాఠశాల శిథిలావస్థకు చేరింది. వెంటనే ఉపాధ్యాయులు ఎంపీపీ సత్యనారాయణకి తెలుపగా ఆయన వెంటనే స్పందించి పాఠశాలని సందర్శించారు. ఈ క్రమంలో తాత్కాలికంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ఇవాళ ప్రారంభించారు.