కోనసీమ: మండపేట ఏడిద కొత్తపేటలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిలుగా జడ్పీటీసీ కురిపూడి భవాని రాంబాబు మాజీ సొసైటీ అధ్యక్షులు రామిశెట్టి శ్రీ హరిబాబు హాజరయ్యారు. బాబు జగజ్జీవన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు.
KRNL: రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు చేపట్టినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం తెలిపారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఓవర్ స్పీడ్ 2,299, హెల్మెట్ లేకుండా 2,072, సెల్ఫోన్ వినియోగం 567 కేసులు నమోదు చేశామన్నారు. అదనంగా 2,236 డ్రంక్ అండ్ డ్రైవింగ్, 4,318 ఓపెన్ డ్రింకింగ్ కేసులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఇవాళ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా కమాండెంట్ మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాల అభ్యున్నతి అణగారిన ప్రజల సమాన హక్కుల కోసం ఆయన కృషి చేశారన్నారు.
గుంటూరు: జిల్లాలోని పొన్నూరు మండలం ములుకుదురు సమీపంలో ఆదివారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు దెబ్బతినగా, రెండు వాహనాల్లో ఉన్న పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రమాదం తృటిలో తప్పింది. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
కాకినాడ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ను శనివారం సాయంత్రం పిఠాపురం మాజీ MLA వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వేసవి నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని వర్మ తెలిపారు.
CTR: విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి డివిజన్ పరిధిలో ప్రత్యేక అదాలత్ నిర్వహించనున్నట్లు ఈఈ మునిచంద్ర తెలిపారు. ఈ అదాలత్ రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించబడనుంది. వినియోగదారులు తమ సమస్యలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. బిల్లుల వివాదాలు, కనెక్షన్ సమస్యలు, మీటర్ లోపాలు వంటి అంశాలపై ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తారు.
TPT: ప్రత్యేక హోదా సాధించలేని కూటమి నాయకులు అమరావతి రాజధాని చట్టబద్ధతపై సంబరాలు జరపడం విచిత్రమని సీనియర్ రాజకీయ నాయకుడు డా. వి.పి. కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హోదా హామీ నెరవేర్చలేకపోయారని, హోదా వల్లే రాష్ట్రానికి నిజమైన అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఎన్టీఆర్: విజయవాడ వన్ టౌన్ ఎస్ఐ భాగ్యలక్ష్మి శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మితిమీరిన మద్యం వల్ల ప్రమాదాలు పెరిగి ప్రాణనష్టం జరుగుతోందని తెలిపారు. రహదారి నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
గుంటూరు: పరువు హత్య కేసు నేపథ్యంలో మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెండ్ కావడంతో పోలీసు సిబ్బందిలో కలవరం నెలకొంది. బాధిత కుటుంబం వద్ద డబ్బుల వ్యవహారంలో హోంగార్డు, హెడ్ కానిస్టేబుల్ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తదుపరి చర్యలు తమపై పడతాయేమోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
VSP: గాజువాకలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గాజువాకకు చెందిన అశోక్ పటేల్(46) అనే వ్యక్తి కూర్మన్నపాలెం వైపు వెళ్తుండగా వడ్లపూడి వంతెనపై, వెనుక నుంచి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో అశోక్ శరిం నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఆలూరులో ‘ఇంటింటికీ దీపోత్సవం’ కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి తన నివాసంలో దీపాలు వెలిగించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రైతుల దీర్ఘకాల పోరాటానికి లభించిన గౌరవమని ఇంఛార్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసులను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలలో ఏఎస్ఐలు, హెచ్సీలు, కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న సిబ్బంది వెంటనే తమ కొత్త విధి స్థానాల్లో చేరాలని ఎస్పీ కార్యాలయం అధికారులు తెలిపారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు సమాచారం.
E.G: రాజమండ్రి నుంచి రావులపాలెం వెళ్తున్న బస్సులో మాయచేసి బంగారు హారం దొంగిలించిన ఘటన జరిగింది. చంటి బిడ్డకు పాలు కలపాలని చెప్పి బాధితురాలి దృష్టి మళ్లించి బ్యాగులోని 24 గ్రాముల హారం అపహరించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సత్యసాయి: రొద్దం మండలం రాచూరు గ్రామంలో సోమవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ పర్యటించనున్నారు. ‘కాఫీ విత్ క్యాడర్’ కార్యక్రమంలో ఆమె పాల్గొని పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. మండలంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కన్వీనర్ బి.తిమ్మయ్య కోరారు.
NDL: కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బనగానపల్లెలో అంతే క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. రవీంద్రనాథ్ రెడ్డి తనపై, ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆరోపణలు నిరూపించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.