గుంటూరు: పరువు హత్య కేసు నేపథ్యంలో మాచర్ల సీఐ వెంకటరమణ సస్పెండ్ కావడంతో పోలీసు సిబ్బందిలో కలవరం నెలకొంది. బాధిత కుటుంబం వద్ద డబ్బుల వ్యవహారంలో హోంగార్డు, హెడ్ కానిస్టేబుల్ పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తదుపరి చర్యలు తమపై పడతాయేమోనని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.