కోనసీమ: ఏపీ రాజధాని అమరావతి పేరు అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారు. రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. అమరావతి విషయంలో జగన్కు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతున్నాను అన్నారు. ప్రజల ఆకాంక్షను గౌరవించి అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ELR: జిల్లా సమీక్షా కమిటీ సమావేశం కార్యక్రమాల నిమిత్తం శుక్రవారం ఏలూరులోని రెవెన్యూ గెస్ట్ హౌస్ కు మంత్రి నాదెండ్ల మనోహర్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పల నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: జిల్లాకు ఈ నెల 6న వస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటనలను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం యాడికిలో జలధార కార్యక్రమంలో పాల్గొంటారని, గవర్నర్ అనంతపురంలోని జేఎన్టీయూ స్నాతకోత్సవానికి హాజరవుతారని తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె రూరల్ మండలం బెస్తపల్లిలో చింత చెట్లను అనుమతి లేకుండా నరుకుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పార్టీ నాయకుడు వందల ఏళ్ల ప్రాచీన చెట్టును కూడా అనుమతులు లేకుండా నరిపించాడని ఆరోపించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడం పట్ల మండిపడ్డారు. సంబంధిత రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KDP: ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 238 కేసులు నమోదు చేసి, రూ.46,590 జరిమానా విధించినట్లు తెలిపారు.
W.G: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో శనివారం BRMV మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు తెలిపారు. CCL ప్రోడక్ట్ ఇండియా లిమిటెడ్ నిధులతో మూడో విడతగా 264 సైకిల్లు వివిధ పాఠశాలలకు అందజేయడం జరుగుతుందని అన్నారు.
కర్నూలులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ట్రాఫిక్ సీఐ మన్సరుద్దీన్ మాట్లాడారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిసరాల్లో అక్రమ పార్కింగ్, రహదారి ఆక్రమణలను తొలగించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే వాహనాలపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు పాటించాలని సూచిస్తూ, ఉల్లంఘనలకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
NDL: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా పోలీస్ సంక్షేమ దివస్ నిర్వహిస్తున్నామని ఎస్పీ సునీల్ షోరాణ్ తెలిపారు. శుక్రవారం నంద్యాల ఎస్పీ కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. విధుల్లో ఉన్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: కంభం పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. శనివారం ఉదయం 6:30 నుంచి 11:30 వరకు సబ్ స్టేషన్లోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
కృష్ణా: ఏపీ రాజధాని అమరావతిని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కంకిపాడు మండలం టీడీపీ కార్యాలయంలో నుంచి బస్టాండ్ వరకు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని కేంద్రం పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ప్రతి తెలుగు వాడి హర్షించదగ్గ విషయమని అన్నారు.
PLD: వినుకొండ పురపాలక సంఘం పన్నులు వసూళ్లలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నగరపాలక సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీలు మొత్తం 126 ఉండగా మార్చి 31 నాటికి పన్నులు వసూళ్లు 6.58 కోట్ల గాను 6.25 కోట్లు వసూలు చేసి 95 శాతంతో ప్రథమ స్థానంలో నిలిచిందని కమిషనర్ శివరాం ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు.
GNTR: CM చంద్రబాబు శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ముందుగా అక్కడ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం క్లస్టర్ ఇంఛార్జ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులకు ఈ మేరకు ఆయన దిశానిర్దేశం చేశారు.
E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో కొలువై ఉన్న శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవస్థానానికి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్ భోగి విశ్వనాథ్ జి విచ్చేసి స్వామివారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా విష్ణు సహస్ర నామ కల్చర్ ఫెడరేషన్ సభ్యులు బలుసు సత్యనారాయణ పాల్గొన్నారు.
కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రజల కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీఎస్పీ బాబు ప్రసాద్ ఇవాళ ప్రారంభించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల సేవలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
W.G: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపించినట్లు పేర్కొన్నారు. అలాగే స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.