ATP: నవభారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు అనంతపురంలో ఘనంగా జరిగాయి. జిల్లా ప్రజా పరిషత్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, ఎంఎస్ రాజు, బండారు శ్రావణి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ELR: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డా.బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద గల ఆర్టీసీ డిపో గ్యారేజీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
నెల్లూరు వేదాయపాళెం పోలీసులు 30కు పైగా కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ జొన్నలగడ్డ శ్రీనాథ్ను సాహసోపేతంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల విలువైన బంగారం, వెండి, ల్యాప్ టాప్, కెమెరా స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి, హుబ్లీలలో వరుస చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
SKLM: బాల్యవివాహాలు అరికట్టేందుకు కృషి చేయాలని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. మంగళవారం మండలం గ్రామంలో శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు హక్కులు, చట్టాలు పట్ల అవగాహన అవసరం అని, వాటి ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు ఉంటాయని అన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణం చేస్తున్నపడు హెల్మెట్ ధరించాలన్నారు.
PPM: విద్యుత్ ట్రాన్స్షార్మర్ మంజూరు చేయాలని RTI జిల్లా అధ్యక్షులు ఐ. రామకృష్ణారావు డిమాండ్ చేసారు. మంగళవారం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. కురుపాం మండలం మొండెంఖల్ గ్రామం లోవోల్టేజ్తో ఇబ్బందిగా ఉంది అన్నారు. ఒకటీ, రెండు, మూడు రోజులు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిపారు.
AKP: గొలుగొండ మండలం సీ.హెచ్. నాగాపురం గ్రామంలో గంగాదేవి తల్లి పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఈదరపల్లి, S.యానాం, ఉప్పలగుప్తం గ్రామాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. అమలాపురం ఎమ్మెల్యే శ్రీ అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా గ్రామాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.
VSP: విశాఖలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. జడ్పీ సీఈఓ నారాయణమూర్తి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో విపత్తులు, అగ్నిమాపక దళ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. వేసవిలో అగ్నిప్రమాదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఫైర్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
VSP: డా,బి.ఆర్.అంబేద్కర్ 135వ, జయంతి సందర్భంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పాలెం గ్రామంలో భోగాపురం గ్రామీణ సీఐ జీ.రామకృష్ణ, ఎస్సై సన్యాసినాయుడు మంగళవారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు లో పాల్గొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు.
సత్యసాయి: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుమారు రూ.25 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
కడప జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు నైట్ పెట్రోలింగ్ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు రాత్రివేళ అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. లాక్డ్ హౌస్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు.
PPM: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్వతీపురంలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, న్యాయవేత్తగా విశిష్ట స్థానాన్ని సంపాదించారని తెలిపారు.
ELR: గణపవరంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ ప్రజల కోసం ఆయన రచించిన రాజ్యాంగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
KRNL: రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 29న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ గుప్తా హాజరుకానున్నారు.