GNTR: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ చలివేంద్రంను ఏర్పాటు చేసింది. స్థానిక బాలాజీ రావు పేటలోని తడికల మిల్లు సమీపంలో ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో గురువారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి గాను స్థానికులు ట్రస్ట్ సభ్యులను అభినందించారు.
KRNL: చిప్పగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు.డా.అఫ్రోజ్ బేగం ఆధ్వర్యంలో గర్భిణీలకు రక్తపోటు,హీమోగ్లోబిన్ తదితర పరీక్షలు చేసి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. గర్భధారణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు,పోషకాహారంపై అవగాహన కల్పించారు.క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
KDP: కలసపాడు మండలం ఎగువ తంబళ్లపల్లె సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ కవిత ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రం ఏర్పాటు చేశారు.పెరుగుతున్న వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీరు అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు ప్రహ్లాద రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో రేపు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలక్ట్రికల్ ప్రభను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఆర్టిస్టులు తన్మై, దొరబాబు, శాంతి కుమార్, రైసింగ్ రాజ వస్తున్నారని నిర్వాహకులు తెలపారు.
PLD: నూజెండ్ల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సెన్సస్-2027లో భాగంగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజెండ్ల ఎమ్మార్వో రమేశ్, ఏఎస్వో నాగశ్రీనివాసరావు ప్రారంభించారు. ఎన్యూమరేటర్లు 26 మంది, సూపర్వైజర్లు ఐదుగురు పాల్గొన్నారు.
BPT: సంతమాగులూరులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘పోషణ పక్వాడా’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో సీడీపీవో డీ. సుధా మాట్లాడుతూ.. గర్భిణులు, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆమెతో పాటు డాక్టర్ జోష్ణ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
E.G: నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరా సాహెబ్ పర్యవేక్షించారు. గురువారం చేపట్టిన మట్టి తవ్వకాలు, కాలువలను పరిశుభ్ర పరిచే పనులను పర్యవేక్షించి, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా కొనసాగాలని, కార్మికులకు వేతనాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.
ASR: రాజవొమ్మంగి మండలం లబ్బర్తిలో జల్ జీవన్ మిషన్ కింద రూ.69 లక్షలతో నిర్మించనున్న రక్షిత మంచినీటి ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి శంకుస్థాపన చేశారు. కేవలం 6 నెలల్లో పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
PPM: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. అలాగే, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు
GNTR: దుగ్గిరాల (మం) మోరంపూడి గ్రేటనాల్టీస్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఈనెల 12న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు వంగర హేమచంద్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో చక్కెర వ్యాధి, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలపై పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
AKP: చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో 8వ పోషణ్ పక్వాడ అవగాహన పక్షోత్సవాల గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. గర్భిణీలు చిరుధాన్యాలు వంటి సంప్రదాయ ఆహారం తీసుకునే విధంగా చూడాలన్నారు. అలాగే, వివిధ థీమ్ల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని విద్యాసంస్థల సమీపంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. చిన్న మార్కెట్, బోయపేట తదితర ప్రాంతాల్లోని షాపుల్లో సోదాలు చేసి నిషేధిత గుట్కా, ఖైనీ, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. యువత ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు.
ATP: ఆర్డీటీ సంస్థ వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతిని అనంతపురంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. సమాజ సేవకు అంకితమైన ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
E.G: కోరుకొండ మండలం బూరుగుపూడిలో PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఉచిత సోలార్ విద్యుత్ అందించే ప్రక్రియను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రూడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గురువారం ప్రారంభించారు. రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి విడతలో 2,883 సోలార్ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండల పరిధిలోని బస్వాపురం టోల్ ప్లాజా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లో స్థానికులు ఓ గుర్తుతెలియని మగ శవాన్ని గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సుమారు ఐదు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు శవాన్ని కాల్చి పడవేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.