E.G: నల్లజర్ల మండలం ఆవపాడు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీరా సాహెబ్ పర్యవేక్షించారు. గురువారం చేపట్టిన మట్టి తవ్వకాలు, కాలువలను పరిశుభ్ర పరిచే పనులను పర్యవేక్షించి, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతగా కొనసాగాలని, కార్మికులకు వేతనాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.