VZM: మహాత్మ జ్యోతిరావు ఫూలే సమాజానికి చేసిన సేవలను ప్రజలందరికీ తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఇవాళ ఫూలే జయంతిని పురస్కరించుకుని కలక్టరేట్లో ఆయన విగ్రహానికి కలెక్టర్ రాంసుందర్ రెడ్డితో కలసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బహుజనులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అహర్నిశలు కృషి చేసారన్నారు.
TPT: కర్ణాటకకు చెందిన TTD బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య, కుమారుడు చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. TTDలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి.
KRNL: మహాత్మ జ్యోతిబా ఫూలే సామాజిక సమానత్వానికి పునాది వేసిన మహనీయుడని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ పేర్కొన్నారు. ఫూలే 199వ జయంతి సందర్భంగా శనివారం ఎంఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది ఎం. రామన్న, జె. హనుమంతు ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతో కలిసి పని ప్రదేశంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తూ.గో: కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రోడ్డు పక్కనే చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ పంచాయతీ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. దుర్వాసన వ్యాపించి, చెత్త ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ELR: చేపలు గుడ్లు పెట్టే కాలం నేపథ్యంలో మత్స్యకారులు వేటకు ప్రభుత్వం 61 రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఏలూరు జిల్లాలోని కొల్లేరు పరిధిలోని 28 గ్రామాల్లో 12,402 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. 129 మెకనైజ్, 290 నాన్ మెకనైజ్ బోట్లతో చేపల వేట చేస్తున్నారు.
KRNL: అవుట్ డోర్ స్టేడియంలో ఈనెల 12న బాలికల క్రికెట్ పోటీల ఎంపికలు జరుగుతాయని ఇవాళ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవేంద్ర గౌడ్ తెలిపారు. అండర్-15, 19, 23, సీనియర్ విభాగాల్లో రేపు ఉదయం 10 గంటలకు ఇవి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు జనన ధ్రువీకరణ పత్రం, గుర్తింపు కార్డులతో హాజరుకావాలని సూచించారు.
గుంటూరు జిల్లా ఎస్టీయూ నేతలు పాఠశాల విద్యాశాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తమీమ్ అన్సారియాను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లుల గురించి వివరించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న పూలే విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానుభావుడు జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త అని కొనియాడారు.
BPT: సంతమాగులూరు మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయంలో శనివారం సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే, స్వాతంత్య్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకుడు బాదం విజయభాస్కర్ రెడ్డి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
SKLM: మహాత్మా జ్యోతిరావు ఫూలే జీవితం నేటి తరాలకు ఆదర్శం అని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.మోహనరావు కొనియాడారు. ఫూలే జయంతి సందర్భంగా ఇవాళ మందసలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆమన ఒక వ్యక్తి మాత్రమే కాదని ఆయన ఒక ఆలోచన, ఒక ఉద్యమం, నేటి తరాలకు దిక్చూచి అని అన్నారు.
ATP: జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో సామాజిక సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజుతో కలిసి ఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.
TPT: నారాయణవనం మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను శనివారం ఉదయం జడ్పీటీసీ కోనేటి సుమన్ కుమార్ పరిశీలించారు. పనులు 60% పూర్తయ్యాయని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి ముందే గదులు సిద్ధం చేయాలని, బిల్లులు సకాలంలో చెల్లించేలా అధికారులు సహకరించాలని కోరారు.
ELR: భీమడోలు కాంపు కార్యాలయంలో ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయూలు అధ్యక్షతన మహాత్మా జ్యోతీబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వీరాంజనేయులు పూలే చిత్రపటానికి పూలమాలు వేసిన నేర్పించారు. అలాగే దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం చెన్నకేశవస్వామి గజవాహనంపై సార్వభౌమాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ఉత్సవపీఠంపై ప్రతిష్ఠించి అర్చన, నివేదన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి మాడవీధు గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.