ATP: యాడికి మండలంలో CM చంద్రబాబు నాయుడు పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర రిహాబిలిటేషన్ డైరెక్టర్ పి.ప్రశాంతి, జేసీ విష్ణుచరణ్తో కలిసి హెలిప్యాడ్, పెండేకల్లు రిజర్వాయర్, మార్కెట్ యార్డులోని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. డ్రిప్ ఇరిగేషన్ స్టాల్స్ను సిద్ధం చేయాలని సూచించారు.
W.G: రాష్ట్రంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ తాడేపల్లిగూడెం. ఇక్కడ హోల్ సేల్ లో కిలో ₹8 కే లభ్యంకగా, రిటైల్ గా కిలో ₹12 కి లభ్యమవుతోంది. 100కి ఆరున్నర కి ఇక్కడ విక్రయాలు జరిగాయన్నారు. దీనిపై హోల్ సేల్ వ్యాపారులు మాట్లాడుతూ.. మహారాష్ట్ర, నాందేడ్తో పాటు మన రాష్ట్రంలో కర్నూలు ఉల్లి కూడా ఒక్కసారిగా అందుబాటులోకి రావడంతో ధరలు తగ్గాయని తెలిపారు.
GNTR: తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో K.L.N. సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అష్టావధానం నిర్వహించారు. అవధాని బాలసుబ్రమణ్యం సాహిత్య పటిమతో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా ఆయనకు “అవధాన సరస్వతి” బిరుదు ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.
ప్రకాశం: సంతమంగులూరు మండలం రోడ్డు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడిపి రోడ్డు క్రాసు చేస్తున్న గొర్రెల మందును ఢీకొనడంతో 3 గొర్రెలు మృతి చెందినట్లు తెలిపారు. గొర్రెల మంద సంతమంగులూరు మండలం మక్కిన వారి పాలెం గ్రామానికి చెందిన కోనంకి శ్రీను విగా గుర్తించారు
ELR: కలెక్టర్రేట్లో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేసి విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు .
ELR: కలెక్టర్రేట్లో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పేదవర్గాల సంక్షేమానికి ఎంతో కృషిచేసి విలువలతో కూడిన రాజకీయ జీవితం గడిపారన్నారు. ఆ మహనీయుని జీవితాన్ని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు .
ELR: ఉంగుటూరు నియోజకవర్గ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వెల్లమిల్లి గ్రామానికి చెందిన ఆకురాతి కిషోర్ ను నియమిస్తూ ఆ సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు భావన ఋషి ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ.. నియోజవర్గంలో నాలుగు మండలాలలో గ్రామ, మండల స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.
తిరుపతి నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 2 వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని, 10.30 నుంచి 11.30 వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం జరుగుతుందని, ఫోన్ ద్వారా ఫిర్యాదులకు 0877-2227208 నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.
NDL: ఉయ్యాలవాడ మండంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన వర్గాల ఘర్షణకు కారణమైన స్థలాన్ని అధికారులు ఆదివారం పరిశీలించారు. టౌన్ సీఐ యుగంధర్, ఎస్సై రామిరెడ్డి, తహశీల్దార్ ప్రసాద్ బాబు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు స్థల పత్రాలను తనిఖీ చేశారు. ఆ స్థలం వ్యక్తిగతమా లేక గ్రామానికి చెందినదా అనేది సమగ్రంగా పరిశీలించి నిజాలను వెల్లడిస్తామని తెలిపారు.
AKP: చిత్తూరులో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ట్రస్థాయి మహిళల హాకీ టోర్నమెంట్కు జిల్లా నుంచి 18 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ తెలిపారు. ఎంపిక పోటీలు ఆదివారం సాయంత్రం ఎలమంచిలి హాకీ గ్రౌండ్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో 25 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
VSP: మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి మధురవాడ ఐటీ సెజ్ రోడ్డులో ఓ యువకుడు ఆదివారం రాత్రి బీభత్సం సృష్టించాడు. రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాలను ఢీకొట్టగా ఒక చిన్నారికి గాయాలయ్యాయి. భయాందోళనకు గురైన ప్రజలు పరుగులు తీశారు. స్థానికులు కారును వెంబడించి కొమ్మాది జంక్షన్ వద్ద అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖ దక్షిణ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన క్యాడర్ డిజిటలైజేషన్లో ఐదో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆశీలమెట్టలో పార్టీ శ్రేణులతో కలిసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యకర్తల కృషితో ఈ ఫలితం సాధ్యమైందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ASR: రాజవొమ్మంగి ఎస్సైగా వెంకటరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బధిలీల్లో రంపచోడవరం ఎస్సైగా చేస్తున్న వెంకటరావును రాజవొమ్మంగి ఎస్సైగా నియమిస్తూ ఎస్పీ అమిత్ బర్దార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం రాజవొమ్మంగి ఎస్సైగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.
KRNL: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలులో ఉద్యమం మరింత ఉద్ధృతమవుతోందని ఫ్యాప్టో నాయకులు తెలిపారు. ఆదివారం జిల్లా విద్యాధికారికి ఫ్యాప్టో నాయకులు ధర్నా నోటీసు అందజేశారు. మూల్యాంకనం విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు రేపటి నుండి నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని తెలిపారు.
TPT: స్విమ్స్ కార్మికుల పోరాటం రోజురోజుకూ ఉధృతమవుతోందని సీఐటీయూ తెలిపింది. హామీలు అమలు చేయకపోతే సంపూర్ణ సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. 38 రోజులుగా నిరసన కొనసాగుతున్నా యాజమాన్యం స్పందించలేదని విమర్శించారు. వార్డుబాయ్స్గా గుర్తింపు, జీతాల పెంపు వంటి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు.