తిరుపతి నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 2 వరకు ఫిర్యాదుల స్వీకరణ ఉంటుందని, 10.30 నుంచి 11.30 వరకు “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమం జరుగుతుందని, ఫోన్ ద్వారా ఫిర్యాదులకు 0877-2227208 నంబర్ అందుబాటులో ఉంటుందని చెప్పుకొచ్చారు.