NDL: ఉయ్యాలవాడ మండంలోని పెద్దయమ్మనూరు గ్రామంలో జరిగిన వర్గాల ఘర్షణకు కారణమైన స్థలాన్ని అధికారులు ఆదివారం పరిశీలించారు. టౌన్ సీఐ యుగంధర్, ఎస్సై రామిరెడ్డి, తహశీల్దార్ ప్రసాద్ బాబు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు స్థల పత్రాలను తనిఖీ చేశారు. ఆ స్థలం వ్యక్తిగతమా లేక గ్రామానికి చెందినదా అనేది సమగ్రంగా పరిశీలించి నిజాలను వెల్లడిస్తామని తెలిపారు.