MDK: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, భూ వివాదాలు, వ్యక్తిగత సమస్యలపై వినతులు అందజేశారు. స్పందించిన కలెక్టర్, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.