E.G: మహిళా బిల్లు రాకపోవడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చెప్పడం తగదని కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీకృష్ణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని చెబుతున్నామన్నారు. అంతకుముందు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతికి సంతానంగా 2 నిమిషాలు మౌనం పాటించారు.
AKP: రాంబిల్లి మండలం జెడ్. చింతువ గ్రామంలో రెన్యూ 3డీ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అక్కడ వారికి రెన్యూ సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ ప్రతినిధులు 3డీ మోడల్ గురించి వివరించారు. అనంతరం బృందంతో కలిసి ముఖ్యమంత్రి గ్రూప్ ఫోటో దిగారు. దీనికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా పలువురికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.
CTR: పులిచెర్ల సమీపంలోని కల్లూరు రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఈనెల 29న ఆలయ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ మురళీమోహన్ రెడ్డి తెలిపారు. ఆలయంలో ఉదయం 6 గంటలకే వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
కృష్ణా: పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో శ్రీ శ్రీ సాగర భగీరథ మహర్షి విగ్రహావిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహర్షి సందేశాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
NDL: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర రావు మృతి పట్ల డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ HYDలోని నాదెండ్ల నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SKLM: విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం.టి. ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు.
VZM: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంధాలయ సేవా సంఘం పుస్తక హుండీ కార్యక్రమాన్ని స్థానిక R&B జంక్షన్లో నిర్వహించింది. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ప్రజల్లో చైతన్యానికి, మేధో వికాసానికి పుస్తకాలు చదివించే ఆసక్తి పెంచాలని ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. స్పందించిన పలువురు అనేక గ్రంథాలను గ్రంధాలయ సంఘానికి అందజేశారు.
NDL: నంద్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టడంతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధనం కోసం వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు తిరుగుతుండటంతో ట్రాఫిక్ రద్దీ పెరిగింది. అధికారులు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
VSP: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా రెండోసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావుకు పాశర్ల ప్రసాద్ శుక్రవారం టీడీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా BRTS బాధితుల సమస్యలను ప్రస్తావిస్తూ, 108 మందికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో TDRలు అందలేదన్నారు. రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు GVMC అధికారులతో మాట్లాడి న్యాయం చేయాలన్నారు.
KDP: మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో రైతు గురప్పకు చెందిన అరటి పంట దగ్ధమైంది. మూడెకరాల్లో సాగు చేసిన పంటలో ఎకరాన్నర పూర్తిగా కాలి బూడిదైంది. బిందు సేద్య పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలను ఆర్పేందుకు రైతు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.
GNTR: మంగళగిరిలో చేనేతలు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ దీక్షకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు మద్దతు పలికారు. అలాగే మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు కూడా పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.
ప్రకాశం: పామూరు పట్టణంలో ట్రాఫిక్, ఆక్రమణలపై సీఐ వినోద్ కుమార్ దృష్టిసారించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన పట్టణంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్డు వెంట ఉండే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య ఎక్కడ ఉందో గమనించారు. అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు.
KRNL: క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేస్తూ పోటీల్లో సత్తా చాటాలని సెట్కూరు సీఈవో డా.వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో శాప్ లీగ్ ఫుట్బాల్ ఎంపిక పోటీలను ఇవాళ ఆయన ప్రారంభించారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత సీఈవో రమణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: కంభంలోని కాపవీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ఆశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
NLR: దుత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మొక్కల పెరుగుదలకు పూర్వ విద్యార్థి పెసల కృష్ణ 120 కిలోల సేంద్రీయ ఎరువును అందజేశారు. HM కె.రమణమ్మతో కలిసి మొక్కలకు ఎరువు వేశారు. ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.