• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రజల సమస్యలను నేరుగా విన్న ఎస్పీ ధీరజ్

అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో మదనపల్లిలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజల సమస్యలను నేరుగా విని, కుటుంబ వివాదాలు, సైబర్ మోసాలు, భూవివాదాలపై విచారణ చేపట్టారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలని అధికారులకు ఎస్పీ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.

April 13, 2026 / 04:26 PM IST

పెచ్చులూడుతున్న పైకప్పు.. భయాందోళనలో గ్రామస్థులు

KDP: బి.మఠంలోని ప్రభునగర్ అంగన్వాడీ సెంటర్‌లో 28 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అయితే, భవనం పైకప్పు పెచ్చులూడుతుండటంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని అంగన్వాడీ టీచర్ లత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం చూపాలని గ్రామస్థులు, సిబ్బంది అధికారులను కోరుతున్నారు. పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

April 13, 2026 / 04:25 PM IST

మాజీ సర్పంచులకు సన్మానం చేసిన మాజీ డిప్యూటీ సీఎం

PPM: కురుపాం నియోజకవర్గంలోని పదవీకాలం పూర్తి అయిన సర్పంచులను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థలు ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలి అన్నారు.

April 13, 2026 / 04:11 PM IST

రాష్ట్రపతి ముర్ముకు కూటమి నేతల కృతజ్ఞతలు

CTR: అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంత్రి నారా లోకేష్ , చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు సహా కూటమి ఎంపీల బృందం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన భేటీలో అమరావతి విశిష్టతపై వివరించే బుక్‌లెట్‌ను మంత్రి లోకేష్ సమర్పించారు. రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు విజన్‌ను, భూములు ఇచ్చిన రైతులను అభినందించారు.

April 13, 2026 / 04:10 PM IST

‘సమగ్రశిక్ష ఉద్యోగుల కోసం సహకారాన్ని అందజేయాలి’

VZM: సమగ్రశిక్ష ఉద్యోగుల సంక్షేమం కోసం తమ వంతు సహకారాన్ని అందజేయాలని ఉద్యోగుల సంఘం నాయకులు ఆరికతోట రామకృష్ణ, పి. సింహాచలం తెలియజేశారు. ఇవాళ నెల్లిమర్లలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమగ్రశిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమం నిధిని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.

April 13, 2026 / 04:10 PM IST

ఆదోనిలో ముందస్తు అడ్మిషన్లపై ఫిర్యాదు

KRNL: ఆదోనిలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ నాయకుడు శ్రీకాంత్ సబ్ కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా బలవంతపు చేరికలు చేపడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

April 13, 2026 / 04:10 PM IST

గీతాంజలి కుటుంబానికి వైసీపీ ఆర్థిక సహాయం

GNTR: సోషల్ మీడియా ట్రోలింగ్లతో మనస్థాపానికి గురై తెనాలిలో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి పిల్లలకు రూ.50 వేల ఆర్థిక సాయాన్ని వైసీపీ నాయకులు అందజేశారు. గతంలో YS జగన్ ఇచ్చిన హామీ మేరకు సోమవారం తెనాలి వచ్చిన వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో గీతాంజలి భర్తకు ఈ సాయాన్ని అందజేశారు.

April 13, 2026 / 04:10 PM IST

డ్రైనేజీ పనులకు భూమిపూజ చేసిన కూటమి నాయకులు

KRNL: ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మ నగర్‌లో రూ.15.50 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు కూటమి నాయకులు సోమవారం భూమిపూజ చేశారు. జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ, టీడీపీ నేత రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. వర్షాకాలంలో మురికినీరు నిలిచే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని నేతలు పేర్కొన్నారు.

April 13, 2026 / 04:06 PM IST

RTC బస్టాండ్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

మార్కాపురంలోని RTC బస్టాండ్‌ను స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అదేవిధంగా క్యాంటీన్ నిర్వహిస్తున్న తీరును, ప్రయాణికులు బస్టాండులో కలుగుతున్న అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో RTC డీఎం సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

April 13, 2026 / 04:05 PM IST

ఫేషియల్ హాజరుతో శ్రామికులకు ఇబ్బందులు

ASR: ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మలో సోమవారం ప్రారంభమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో ఫేషియల్ హాజరు విధానం శ్రామికులకు సమస్యగా మారింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనిచేసినప్పటికీ మొబైల్ యాప్‌లో ముఖచిత్రం నమోదు కావడం లేదని శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. హాజరు నమోదు కాకపోవడంతో ఒకరోజు వేతనం నష్టం వాటిల్లిందని తెలిపారు.

April 13, 2026 / 04:00 PM IST

ఆపరేషన్ చేసి కణితి తొలగింపు

AKP: కోటవురట్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ పేషంట్‌కు సర్జన్ డాక్టర్ రవికిరణ్ ఇవాళ ఆపరేషన్ చేసి 1.50 కిలోల కణితిని తొలగించారు. పెదబొడ్డేపల్లికి చెందిన ఎం పార్వతి (57) ఎడమ తుంటి భాగంలో కణితి ఏర్పడింది. దీంతో స్థానిక సీ.హెచ్.సీ.లో చేరింది. డాక్టర్ పరీక్షించి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ సహాయంతో ఆపరేషన్ చేశారు.

April 13, 2026 / 04:00 PM IST

‘తిరుపతిలో కార్మిక సత్తా చూపిద్దాం’

E.G: ఈ నెల 26, 27, 28 తేదీలలో తిరుపతిలో జరిగే AITUC రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, 26న జరిగే కార్మిక ప్రదర్శనకు పెద్ద ఎత్తున కార్మికులు తరలిరావాలని CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. సోమవారం రాజమండ్రిలో మేస్త్రీల సమావేశం యూనియన్ అధ్యక్షుడు కె. రాంబాబు అధ్యక్షతన జరిగింది. మే డే వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు.

April 13, 2026 / 04:00 PM IST

ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ను కలిసిన రంగయ్య, విశ్వేశ్వరరెడ్డి

ATP: ​ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్‌ను మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి కలిశారు. అనంతపురంలోని ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. గతంలో నిలిచిపోయిన FCRA లైసెన్స్ పునరుద్ధరణ కోసం వారు చేసిన కృషిని మాంచో ఫెర్రర్ గుర్తుచేసుకున్నారు. జిల్లాలో సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలపై చర్చించారు.

April 13, 2026 / 04:00 PM IST

ఖాద్రీశుని అంతరాలయ దర్శనం పునఃప్రారంభం

సత్యసాయి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కదిరి లక్ష్మీనరసింహ స్వామి వారి అంతరాలయ దర్శనం ఈ నెల 15 నుంచి పునఃప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 6:45 గంటల వరకు భక్తులకు ప్రహ్లాద సమేత అంతరాలయ దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 13, 2026 / 04:00 PM IST

సీఎం పోస్టు కార్డు ఉద్యమానికి అపూర్వ స్పందన

KDP: నగరంలోని ఎర్రముక్కపల్లి–విశ్వనాధపురం మధ్య పెండింగ్‌లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సీఎం పోస్టు కార్డు ఉద్యమానికి విశేష స్పందన లభించింది. రెండు సంవత్సరాలుగా పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బ్రిడ్జిని పూర్తి చేయాలని సాధన కమిటీ డిమాండ్ చేశారు.

April 13, 2026 / 03:49 PM IST