KRNL: కోసిగి గ్రామ ప్రత్యేక అధికారిగా వ్యవసాయ అధికారి వరప్రసాద్ నియమితులయ్యారు. గురువారం దొరల కాలనీలో పర్యటించి తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించారు. అనంతరం బీరప్పగుడ్డి కాలనీలో శ్మశానవాటికకు వెళ్లే దారిలోని డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
ATP: అనంతపురం జిల్లాకు ట్రైని కలెక్టర్ సుయాష్ కుమార్ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాలకు ట్రైనీ కలెక్టర్లను నియమించారు.ముస్సోరిలో శిక్షణ పూర్తి చేసుకున్న సుయా ష్ కుమార్ను జిల్లా ట్రైని కలెక్టర్గా నియమించినట్లు తెలిపారు.
E.G: బొమ్మూరు PS పరిధిలోని ప్రధాన కూడళ్లలో బుధవారం SI రమేశ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి జరిమానా విధించారు. తనిఖీల్లో భాగంగా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు SI కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని ఆయన హెచ్చరించారు.
SKLM: పోలాకి మండలం అంపలాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ Z.P హైస్కూల్లో గురువారం శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తిటీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం గిరిధర్ అన్నారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
KRNL: జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, 20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకరన్ పనితీరును ప్రశంసించారు. కేంద్ర, రాష్ట్ర పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించడం అవసరమన్నారు. అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తే మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. పరిపాలన బలోపేతంతో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.
KDP: ప్రొద్దటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సైడ్ మునీరాని ఈరోజు ఘనంగా సన్మానించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని మునీరాకి శుభాకాంక్షలు తెలిపారు.
GNTR: కాకుమాను మండలం అప్పాపురం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మురిగిపోయిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. పసిపిల్లలకు పౌష్టికాహారం కింద పాడైన గుడ్లు ఇస్తుండటం పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన గుడ్లను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ATP: ఆర్డీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా అనంతపురంలో విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాల్లో ఫెర్రర్ చేసిన సేవలను మంత్రి నారా లోకేశ్ కొనియాడారు. ఈ ఏడాది ఆర్డీటీకి FCRA అనుమతి సాధించి, సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా సాగేలా కృషి చేశామని పేర్కొన్నారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో ఆయన చిరకాలం నిలిచిపోతారని లోకేశ్ కొనియాడారు.
AKP: నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలమంచిలి ఎంపీపీ రాజాన శేఘ సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జలధార-జల హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వందరోజుల ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యంగా భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలన్నారు. సాగునీటి కాలువల మరమతులు చేయించాలన్నారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు సందర్శించారు. ప్రస్తుతం 200 మంది వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నట్లు ఆసుపత్రి డాక్టర్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలని డీసీవీ ఛైర్మన్ బాబు ఆదేశించారు.
PLD: నరసరావుపేట (M) ములకలూరులో ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గురువారం పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించారు. చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసే షెడ్లను సందర్శించి కార్మికులతో మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వల్ల రైతులకు లాభాలున్నాయని తెలిపారు. పరిశుభ్రత కోసం ప్రజలంతా చెత్తను వేరుచేసి ఇవ్వాలని ఆయన సూచించారు.
సత్యసాయి: కదిరి మండలం పట్నం గ్రామంలో విషాదం నెలకొంది. పొలం వద్ద పంట కోసం ఉంచిన యూరియా కలిపిన నీరు తాగి 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి క్రిష్ణ మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా, గొర్రెలు దాహంతో బకెట్లలోని నీటిని తాగాయి. కొద్దిసేపటికే కడుపు ఉబ్బి అవి ప్రాణాలు విడిచాయి. సుమారు లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లిందని రైతు వాపోయారు.
NTR: విజయవాడలో దేవాదాయ శాఖ ఏసీ కె.శాంతిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. అక్రమాస్తుల కేసులో ఐదు రోజులపాటు విచారణకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు ఏసీబీ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కాగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
KDP: జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులపై నిఘా పెంచారు. లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించి, ఆధార్ వివరాలు పరిశీలిస్తున్నారు.
అన్నమయ్య: రాయచోటిలోని రాయుడు కాలనీలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి “వాక్ విత్” కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధిలైట్ల సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయగా, వెంటనే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగతావాటిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు.