SKLM: ఆమదాలవలస కృష్ణాపురం మున్సిపల్ మోడల్ ప్రైమరీ పాఠశాల పరిధిలో కాంపెయినింగ్ నిర్వహించినట్లు హెచ్ ఎం ఎస్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడి లేని బోధనతోపాటు ప్రభుత్వం ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, యూనిఫాం, మిడ్ డే మీల్స్ వంటి సదుపాయాలు కల్పిస్తుందని తల్లిదండ్రులకు అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
KDP: లింగాల నుంచి ఉదయాన్నే వెళ్లే మొదటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఉదయం గ్రామస్థులు, విద్యార్థులు, కూలీలు, ఉద్యోగస్థులు ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో ఆ బస్సులో అడుగు తీసి అడుగు పెట్టాలంటే కష్టంగా మారిందన్నారు. RTC DM స్పందించి ప్రయాణికుల అవస్థలను గమనించి అదనపు బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
KKD: తాళ్లరేవు మండలం సీతారామపురంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వివాదాల కారణంగా కేసు నమోదు కాగా, మనస్తాపంతో సెల్ఫీ వీడియో, లేఖ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కుమారుడిని తల్లి వద్దే ఉంచాలని వీడియోలో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: తాడిపత్రిలోని 32వ వార్డు బిందెల కాలనీలో ఎమ్మెల్యే జేసీ అశ్విత్ రెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అక్కడికక్కడే మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.
ప్రకాశం: నేడు మార్కాపురం కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలీ జహీర్ ఆధ్వర్యంలో లాయర్లు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.. అనంతపురం బార్ అసోసియేషన్ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా బహిష్కరణ చేస్తున్నట్లు తెలిపారు. మార్కాపురంలో 116 మంది లాయర్లు విధులు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
అన్నమయ్య: పీలేరు(M) ముడుపుల వేముల గ్రామ సచివాలయాన్ని RDO శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.రికార్డులను పరిశీలించి, హాజరు వివరాలు తెలుసుకున్నారు. గైర్హాజరైన సిబ్బందిపై విచారణ చేపట్టారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేష్ పాల్గొన్నారు.
NDL: కొలిమిగుండ్ల మండలం నందిపాడులో IPL క్రికెట్ బెట్టింగుకు పాల్పడుతున్న 8 మంది యువకులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. పలువురు క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో కొందరిని విచారించామన్నారు. వారిలో 8 మంది బెట్టింగుకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి రూ.24వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతులు తమ పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ మేనేజర్ గురుమూర్తి కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, వన్ బి అడంగల్ తీసుకొని రైతులు తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
NLR: ఆత్మకూరు మండలం, కరటంపాడు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటోలో ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్ మరిచి వెళ్లిపోయినట్లు గుర్తించిన ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సై జిలానికి అందించాడు. ఎస్సై జిలాని మాట్లాడుతూ.. ఈ ఫోన్కి సంబంధించిన ఆధారాలు చూపించి ఫోన్ తీసుకెళ్లాలని సూచించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ను ఎస్సై అభినందించారు.
సత్యసాయి: జిల్లాలోని పుట్టపర్తి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్లో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక పుట్టపర్తి డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
KRNL: పెద్దకడబూరులోని లక్ష్మీపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధమయి సర్వం కోల్పోయి వీధిన పడ్డ జెల్లి అంజినయ్య కుటుంబానికి వైసీపీ నేతలు అండగా నిలిచారు. శుక్రవారం వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివరామరెడ్డి, విజయేంద్ర రెడ్డి బాదిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యవసర వస్తువులు, రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
PLD: పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా తన జనగణన వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. శుక్రవారం se.census.gov.in వెబ్సైట్ ద్వారా స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) పూర్తి చేశారు. ఇందులో 33 ప్రశ్నలకు వివరాలు అందించారు. ఈ నెల 30 వరకు ప్రజలు తమ ఇళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
VZM: నూతనంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమింపబడ్డ గంట్యాడ శ్రీదేవి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయ, మంత్రులు లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అధ్యక్షతన పొన్నాడలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. రానున్న వర్షాకాల సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని, ప్రజలను వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. హాస్పిటల్ నందు మందుల నిర్వహణ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టీలు పరిశీలించారు.
గుంటూరు: తెనాలికి చెందిన ఇస్కఫ్, సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ, డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నందులపేటలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి మంచి స్పందన లభించింది. శిబిరానికి వచ్చిన పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వైద్య సలహాలు అందజేశారు.