SKLM: సోంపేట నియోజకవర్గంలో ఆదివారం పైడిగం హెడ్ ఛానల్ను రైతు ప్రతినిధులు పరిశీలించారు. ఇటీవల తుఫాన్లతో కాలువ దెబ్బతిని, శిధిలావస్థకు చేరిందని వారు అన్నారు. రూ.36 కోట్ల అంచనా ఉన్నా ప్రభుత్వం నిధులు కేటాయించలేదని విమర్శించారు. కంచిలి, మందస, సోంపేట మండలాల రైతులకు ఇది కీలకమైన కాలువ అని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
KRNL: కర్నూలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.రుద్రవరం సమీపంలో గల కేసీ కాలువలో ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన మౌలాలి (35)గా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి-అంకంపాలెం రహదారిలో ఉన్న సాయంత్రం కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్నికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోయినా, సామగ్రి దగ్ధమైంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గుంటూరు నగర సమస్యలను పరిష్కారించడంలో యువత చురుకుగా పాల్గొనాలని TJPS కళాశాలలో యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు కళాశాలలో జరిగిన సమావేశంలో విద్యార్థులతో కలిసి పారిశుద్ధ్యం, ట్రాఫిక్, విద్య, వైద్య రంగాలపై 7 బృందాలుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. పౌర సంస్థలను ఐక్యం చేసి, దాతల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి దిశగా కృషి చేయాలని సూచించారు.
KRNL: ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దకడబూరు మండలం సీపీఐ నాయకులు బయలుదేరారు. CPI జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలు, రైతులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు.
VSP: విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ శంకర్ నారాయణ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంటుందని, నేరవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ నాగమణి, సిబ్బంది ఉన్నారు.
NLR: కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్యారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 ను సంప్రదించాలని సూచించారు.
CTR: రాజధాని విషయంలో వైసీపీలో అయోమయం నెలకొందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. కార్వేటి నగరం మండలం పాదిరి కుప్పంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోజుకో రాజధాని పేరుతో వైసీపీ నేతలు అయోమయం సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ విషయంలో టీడీపీ అతి ప్రచారం నిర్వహిస్తోందన్నారు.
KDP: ఖాజీపేటలోని అగ్రహారంలో ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన కీర్తన అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. విద్యార్థిని కీర్తనను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. అగ్రహారం అంతా కన్నీటి సంద్రమైంది. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తల్లిదండ్రులు రోధించారు.
PLD: రొంపిచర్లను అభివృద్ధి చేసి చూపించామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రొంపిచర్లలో పర్యటించి మాట్లాడారు.. 2004కు ముందు ఈ ప్రాంతంలో తీవ్ర బాంబుదాడులు జరిగేవని గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయన్నారు. ‘నేను ఎమ్మెల్యే అయ్యాక శాంతిని నెలకొల్పానని’ చెప్పుకొచ్చారు.
PPM: పార్వతీపురం మున్సిపల్లోని చేపలు, మాంసం మార్కెట్లో తాగునీరు, మరుగుదొడ్లు, కరెంట్, శానిటేషన్, రహదారి వంటి మౌలిక సదుపాయాల లేమితో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లేక నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ, కూటమి పాలన వైఫల్యమని, వెంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
KKD: ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో ఎన్నికైనట్లు ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఆయన పరిచయం చేశారు. గౌరవ అధ్యక్షులుగా తాటిపాక మధు, అధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్గా బొబ్బిలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా తోకల ప్రసాద్ ఎన్నికయ్యారు.
ATP: శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
CTR: శాంతిపురం మండలం టి. కొత్తూరు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రతా నియమాలు, మహిళల భద్రత, నేరాలు, మత్తుపదార్థాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు కలిగి ఉండాలని సీఐ వివరించారు.
SKLM: ఆమదాలవలస(M) సొట్టవానిపేట సబ్ స్టేషన్ పరిధిలోని 11KV ఫీడర్లో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టక్కివలస, ఊసవానిపేట, గేదెలవానిపేట తదితర ప్రాంతాల్లో ఉ.9 గంటల నుంచి మ.1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.