ATP: గుత్తి మండలం ఊటకల్లు గ్రామ సమీపంలో శనివారం ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ఉన్న ఓ విద్యార్థికి స్వల్ప గాయాలు అయ్యాయి. బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై పోలీసులకు దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: కాట్రేనికోన మండలం చెయ్యేరు పీహెచ్సీ ఉపకేంద్రంలో అపారిశుధ్యం తాండవిస్తుందని ప్రజలు అంటున్నారు. ఎక్స్ఫేర్ అయిన మందులు అక్కడే గుట్టలుగా వేసి తగలబెట్టడంతో పరిసరాలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భవనం వద్ద ఉన్న మరుగుదొడ్లలో చెదల పుట్టలు వెలిశాయి. సూదులు, గాజు సీసాలతో ఆసుపత్రి ప్రాంగణం అంతా దారుణంగా ఉందని రోగులు అంటున్నారు.
SKLM: బైబిల్ బోధనలు సమాజానికి మార్గదర్శకం అని జిల్లా ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఇవాళ ఉదయం జిల్లాలోని రన్ ఫర్ జీసస్ కార్యక్రమం క్రైస్తవులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. యేసుక్రీస్తు జీవితం ప్రేమ, కరుణ, క్షమ, సేవ అనే విలువలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ యువత పాల్గొన్నారు.
VZM: సర్పంచుల పదవీ కాలం ముగియటంతో మెరకముడిదాం మండలంలోని 29 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు స్థానిక MPDO జి.భాస్కరరావు ఇవాళ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రత్యేక అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేంతవరకు విధుల్లో కొనసాగుతారని పెర్కొన్నారు.
NLR: అమరావతిని రాజధానిగా ఆమోదించిన పార్లమెంట్ నిర్ణయంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ బాయ్ కాట్ చేయడం దురదృష్టకరమన్నారు. రైతుల త్యాగాలు వృథా కాలేదని ఆయన అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలతో అమరావతి దేశంలోనే అగ్ర రాజధానిగా రూపుదిద్దుకుంటుందని సోమిరెడ్డి పేర్కొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడి నాలుగేళ్లు గడిచినా మౌలిక వసతులు అభివృద్ధి చెందలేదు. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నూతన కలెక్టరేట్ నిర్మాణం స్థల పరిశీలనకే పరిమితమైంది. దీంతో గిరిజనులకు పూర్తి స్థాయి జిల్లా పాలన అనుభూతి కలగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
GNTR: కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన షేక్ రేష్మ జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2024లో L.L.B పూర్తి చేసిన ఆమె 2025లో జరిగిన పరీక్షలో తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆమె విజయం పట్ల రేష్మకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
ATP: గుత్తిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ సీఎస్ఐ చర్చి నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చర్చి పాస్టర్స్ మాట్లాడుతూ.. మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో ఏసుక్రీస్తు జన్మించారన్నారు. అందరిని సమానంగా చూడాలని, ప్రేమ, కరుణ భావాలతో మెలగాలని ఏసుక్రీస్తు పేర్కొన్నారన్నారు. సమాజ సేవలో ఉండాలని చెప్పిన కరుణామయుడు ఏసుక్రీస్తు కొనియాడారు.
NTR: నందిగామ(M) ఐతవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చందర్లపాడు (M) తోటరావులపాడు గ్రామానికి చెందిన స్వామిగా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
బాపట్లలో శనివారం ‘రన్ ఫర్ జీసస్’ ర్యాలీ ఘనంగా జరిగింది. గుడ్ఫ్రైడే, ఈస్టర్ పండుగల సందర్భంగా పాస్టర్ల ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఎఫ్.డబ్ల్యు.కోల్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ దయ, ప్రేమ, కరుణతో మెలగాలని ఆయన సూచించారు. సూర్యలంక వద్ద మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా ఉత్సాహంగా సాగింది.
PLD: అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రయాణం చేసే పడవలకు గుంటూరు జడ్పీలో 8న పాట నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పార్వతి తెలిపారు. మండలంలోని దిడుగు, ధరణికోట ప్రాంతాలలో కృష్ణా నది పై వైపుకు పడవ తిరిగేందుకు పాటలు నిర్వహించి, టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన ధారావత్ సొమ్ము చెల్లించి పాటలో పాల్గొనాలని పేర్కొన్నారు.
W.G: టీటీడీ పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఛైర్మన్ బీఆర్. నాయుడుని తక్షణమే తొలగించాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం తణుకు వెంకన్న దేవాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలు జిల్లా గోల్ షూట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా హుసేనాపురం వాసి బోయ నరేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి దేవి ప్రియ శనివారం ప్రకటన విడుదల చేశారు. అసోసియేషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో క్రీడ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నరేష్ కుమార్ తెలిపారు.
AKP: రాష్ట్రస్థాయిలో జరిగే మహిళ హాకీ టోర్నమెంట్కు అంతర్ జిల్లాల ఎంపిక పోటీలు రేపు ఎలమంచిలిలో జరుగుతాయని జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే.నరేష్ తెలిపారు. 2007 జనవరి ఒకటో తేదీ తర్వాత జన్మించినవారు ఈ పోటీలకు అర్హులుగా పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరిగే ఈ పోటీలకు ఆధార్ కార్డులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.