• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వినాయకనగర్‌లో మౌలిక వసతులు కల్పించండి’

సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని వినాయకనగర్‌లో డ్రైనేజీ కాలువ, వీధి విద్యుత్ లైన్, వీధి కొళాయి ఏర్పాటు చేయాలని సీపీఎం, భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. సోమవారం మండల ఎంపీడీవో వెంకటలక్ష్మికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో ప్రాథమిక సదుపాయాల లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పెద్దన్న వివరించారు.

February 23, 2026 / 12:05 PM IST

జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

Akp: జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యమి, సాధక్, ప్రధాతగా మూడు వర్గాలుగా సభ్యత్వాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. కరపత్రాలను విడుదల చేశారు.

February 23, 2026 / 12:01 PM IST

ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదన్నారు.

February 23, 2026 / 12:00 PM IST

డ్రోన్ సహాయంతో కోడి పందాల నిర్వహకుల పట్టివేత

NLR: మనుబోలు మండలం పిడూరుపాలెం పొలాల్లో సోమవారం కోడిపందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరా ప్రయోగించారు. కోడిపందాలు ఆడుతున్న వారిని గుర్తించి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 బైకులు, రూ. 800 నగదు, 5 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శివ రాకేష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 23, 2026 / 11:59 AM IST

కనిగిరిలో TDP కార్యకర్తల సమావేశం

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక TDP కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 23, 2026 / 11:59 AM IST

బకాయిలు చెల్లించి కార్మికులను ఆదుకోండి: ఎమ్మెల్యే

NLR: 15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో సోమవారం గళమెత్తారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని చేసేవారన్నారు.పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

February 23, 2026 / 11:56 AM IST

కొమరోలులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ప్రకాశం: కొమరోలు మండలంలోని మాధవపల్లె గ్రామ సమీపంలోని క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సూరే శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

February 23, 2026 / 11:50 AM IST

ఘనంగా ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం

VSP: చినగదిలిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఇవాళ ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 23న పద్మశ్రీ పి.సి.సర్కార్ జన్మదినాన్ని పురస్కరించుకుని బాల వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలికలు చదువుతో పాటు కళల్లోనూ రాణించాలని నిర్వాహకులు సూచించారు.

February 23, 2026 / 11:50 AM IST

నర్సీపట్నంలో న్యాయవాదులు నిరసన

AKP: నర్సీపట్నం న్యాయస్థానాల ఆవరణలో సోమవారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ట ప్రభాకర్ మాట్లాడుతూ కర్నూలు సిటీలో పవన్ కుమార్ అనే న్యాయవాది మీద సీఐ విక్రమ సింహ దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 11:49 AM IST

చేనేత అంశంపై మంత్రి సవిత సమాధానం

సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో సోమవారం మంత్రి సవిత పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చీరాల చేనేత క్లస్టర్‌కు రూ.4.17 కోట్లు మంజూరు చేశామని, చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలిపారు. ధర్మవరంలో రూ.38.31 కోట్లతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

February 23, 2026 / 11:47 AM IST

గొడవ పడి తండ్రిపై దాడి చేసిన కొడుకు

కృష్ణా: పామర్రు మండలం కొండిపర్రు గ్రామంలో దారుణ ఘటన ఇవాళ చోటు చేసుకుంది. వేడి నీళ్లు కాస్తున్న సమయంలో తండ్రి సురేష్‌తో గొడవ పడిన కొడుకు మహేష్ కత్తితో దాడి చేశాడు. తండ్రిని మన వద్ద నరకడంతో తీవ్రంగా గాయపడిన సురేష్‌ను మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలోని ఆయన మృతి చెందాడు. కొడుకు మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

February 23, 2026 / 11:46 AM IST

రెండేళ్లుగా మూలన బోరు.. తాగునీటికి ఇబ్బంది

ASR: డుంబ్రిగుడ సామాజిక భవనం వద్ద ఉన్న తాగునీటి బోరు రెండేళ్లుగా పాడై నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు పాడవడంతో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బోరును మరమ్మతు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

February 23, 2026 / 11:46 AM IST

జిల్లాలో పర్యటించనున్న శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు

శ్రీ వాగ్దేవి కళా పీఠం వ్యవస్థాపకులు శ్రీనివాసమూర్తి ఈనెల 24న విజయనగరం జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 10 గంటలకు గురజాడ పాఠశాలలో జరుగనున్న కార్యక్రమంలో తెలుగు భాషా ప్రాశస్త్యం అనే అంశంపై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అందరు హాజరు కావాలని కోరారు.

February 23, 2026 / 11:45 AM IST

ఇస్వీ రైల్వే బ్రిడ్జిపై గుంతల ముప్పు

KRNL: ఆదోని శివారులోని ఇస్వీ రైల్వే బ్రిడ్జిపై ప్రమాదకర గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ముప్పుగా మారాయి. రోజూ వాహనాలు ప్రమాదాలకు గురై పలువురు గాయపడుతున్నారు. గతంలో ప్రభుత్వం కేటాయించిన నిధులతో గుంతలు పూడ్చినా, నాణ్యత లోపంతో మళ్లీ పాత స్థితికి చేరాయి. ఆర్అండ్‌బీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 11:42 AM IST

ఈనెల 24 నుండి ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు

TPT: విజయవాడలోని ఏపీ అసెంబ్లీ క్రీడా మహోత్సవాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శాప్ (SAP) ఛైర్మన్ రవి నాయుడు గారితో క్రీడా వేదికలు, మైదానాల సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే శ్రీకాళహస్తిలో ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని అభివృద్ధి చేయాలని శాప్ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. యువ క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందించాలని కోరారు.

February 23, 2026 / 11:39 AM IST